ఏపీలో బీజేపీ బలం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది..ఎందుకంటే ఇక్కడ బలం ఏమి లేదు కాబట్టే..మాట్లాడకపోవడం బెస్ట్ అని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ఏపీ బిజేపిలో జరిగిన కొన్ని మార్పులతో ఏమైనా బలం పెరుగుతుందా? అనే చర్చ సాగుతుంది. ఇప్పటివరకు అధ్యక్షుడుగా ఉన్న సోము వీర్రాజుని పక్కన పెట్టి దగ్గుబాటి పురందేశ్వరిని అధ్యక్షురాలుగా నియమించారు. అయితే సోము ఉన్నప్పుడు బిజేపి పరిస్తితి ఏంటి? ఇప్పుడు పురందేశ్వరి రావడం వల్ల బిజేపికి ఒరిగేది ఏంటి. ఇదే ఇప్పుడు చర్చ.
సరే గత ఎన్నికల్లో బిజేపికి ఒక శాతం ఓట్లు కూడా రాలేదు. ఇంకా చెప్పాలంటే నోటా ఓట్లని కూడా దాటలేదు. అప్పుడు కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగాయి. అయితే అధ్యక్షుడు ఎవరైనా సరే ఏపీలో బిజేపి పరిస్తితి అంతే. తర్వాత కన్నాని తప్పించి సోము వీర్రాజుని అధ్యక్షుడుగా నియమించారు. ఇక ఈయన వల్ల బిజేపికి పావలా ఉపయోగం లేదు. పైగా ఈయన అధికారంలో ఉన్న వైసీపీని వదిలేసి..టిడిపిపై విమర్శలు చేసేవారు. దీంతో సోము జగన్ మనిషిగా ముద్రవేసుకున్నారు.
మొత్తానికి సోము వల్ల బిజేపికి ఒక్క ఓటు పెరగలేదు. ఇప్పుడు పురందేశ్వరిని అధ్యక్షురాలుగా పెట్టారు. అయితే ఇప్పుడున్న పరిస్తితుల్లో బిజేపికి బలం పెరిగే అవకాశాలు లేవు. కాబట్టి పురందేశ్వరి కూడా ఏం చేసే ఛాన్స్ లేదు. అయితే పొత్తుల విషయంలో ముందు అడుగు పడుతుందా? టిడిపి, జనసేనతో బిజేపి కలిసి వెళుతుందా? అనేది మెయిన్ పాయింట్..పొత్తులు ఉంటే బిజేపికి ఏమైనా కలిసొస్తుంది..లేదంటే పురందేశ్వరి సైతం..బిజేపిని నోటా ఓట్లు దాటించలేరు.