కుప్పంలో గెలవాలని జగన్ చేసే రాజకీయ ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు..అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కుప్పం టార్గెట్ గానే రాజకీయం చేస్తూ ముందుకెళుతున్నారు. అక్కడ అధికార బలంతో ప్రజలని వైసీపీ వైపుకు తిప్పుకోవడానికి తెగ ట్రై చేస్తున్నారు. అలాగే ఆ బలంతోనే కుప్పంలో పంచాయితీ, పరిషత్ ఎన్నికలు గెలిచారు. కుప్పం మున్సిపాలిటీని సైతం కైవసం చేసుకున్నారు. ఇక అలాగే కుప్పం అసెంబ్లీని సైతం కైవసం చేసుకుంటామని వైసీపీ నేతలు సవాళ్ళు చేస్తున్నారు.
ఇక ఆ మధ్య కుప్పం పర్యటనకు వెళ్ళిన జగన్ అదే చెప్పారు. తాజాగా చిత్తూరు పర్యటనకు వెళ్ళిన జగన్..కుప్పం గురించి మాట్లాడారు. ఎప్పటిలాగానే స్క్రిప్ట్ పేపర్ చూస్తూ….తాను పేదలకు మంచి చేస్తున్నానని, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండేలా పనిచేస్తానని, కానీ బాబు మాత్రం ప్రజలని దోపిడి చేసారని చెప్పుకొచ్చారు.
అదే స్క్రిప్ట్ పేపర్ చూస్తూ…ఈ సారి కుప్పం ప్రజలు బై బై బాబు అంటున్నారని అన్నారు. అంటే కుప్పంలో బాబు ఓడిపోతారనేది జగన్ చెబుతున్నారు. మరి అది తేలికగా జరుగుతుందా? అంటే జరిగే ప్రసక్తి లేదనే కుప్పం ప్రజలు అంటున్నారు. ఎందుకంటే కుప్పంకు బాబు ఏం చేశారో అక్కడి ప్రజలకు తెలుసు. ఇప్పుడు వైసీపీ చేసే కుట్ర రాజకీయం తెలుసు. అందుకే అక్కడి ప్రజలు ఇంకా బాబు వైపే ఉన్నారు.
అయితే గత ఎన్నికల్లో బాబుకు 30 వేల ఓట్ల మెజారిటీ వచ్చింది. కానీ ఈ సారి భారీ మెజారిటీ రావడం ఖాయమని తెలుస్తుంది. బాబు లక్ష మెజారిటీ టార్గెట్ గా పెట్టుకున్నారు. కాబట్టి కుప్పంలో బై బై బాబు చెప్పడం కష్టం..రాష్ట్రంలోనే బై బై జగన్ అనే చెప్పేలా ఉన్నారు.