ఎన్టీఆర్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ మొదటగా గెలిచే సీటు ఏదైనా ఉందంటే..అది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అని తెలుగు తమ్ముళ్ళు గట్టిగా చెబుతున్నారు. గత ఎన్నికల్లోనే ఇక్కడ టిడిపి గెలవాల్సింది..కానీ చివరి నిమిషంలో వైసీపీ అధికారులు కలిసి ఈవీఏంలతో మాయ చేసి..కేవలం 25 ఓట్లతో వైసీపీ గెలిచినట్లు ప్రకటించారని టిడిపి నేత బోండా ఉమా ఆరోపించిన విషయం తెలిసిందే.
అసలు 25 ఓట్లు అనేది చాలా ఇబ్బందికరమైన విషయం..ఈ ఓటమితో బోండా వెనక్కి తగ్గలేదు. మళ్ళీ సెంట్రల్ లో తన బలం పెంచుకునే దిశగానే పనిచేశారు. ఓడిపోయాక సైలెంట్ అవ్వలేదు. నియోజకవర్గంలోనే తిరిగారు. ఇటు పార్టీ కోసం నిలబడుతూనే..అటు సెంట్రల్ లో తన బలాన్ని పెంచుకున్నారు. ఇక వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తక్కువ కాలంలోనే ప్రజా వ్యతిరేకత పెంచుకున్నారు. అతిగా నోరు పారేసుకోవడం, సెంట్రల్ లో ప్రజా సమస్యలు పెద్దగా పట్టించుకోకపోవడంతో అక్కడ వైసీపీకి మైనస్ అయింది. దీంతో బోండా మళ్ళీ పికప్ అయ్యారు.
అలాగే ఆయనకు ఆధిక్యం కూడా వచ్చిందని సర్వేల్లో కూడా తేలింది. ఇక అక్కడ బోండా గెలుపుఖాయమని తేలిపోయింది. ఇక బోండా గెలుపు ఫిక్స్ అని వైసీపీ కూడా భావించి..అక్కడ ఏదొక విధంగా గెలవాలని కుట్రలు మొదలుపెట్టిందని టిడిపి శ్రేణులు అంటున్నాయి. ఈ క్రమంలో టిడిపికి అనుకూలంగా ఉండే కొన్ని ఓట్లు తొలగించడం, వైసీపీకి అనుకూలంగా దొంగ ఓట్లు నమోదు చేయించడం చేస్తున్నారట.
ఇటీవల ఒకే డోర్ నెంబర్ తో 500 పైనే ఓట్లు నమోదయ్యాయని బోండా ఉమా చెప్పుకొచ్చారు. ఇక ఇవి నిజమే అని ఎన్నికల అధికారి కూడా చెప్పారంటే వైసీపీ ఏ స్థాయిలో నకిలీ ఓట్లు క్రియేట్ చేస్తుందో అర్ధం చేసుకోవచ్చు అని అంటున్నారు. కానీ ఎన్ని చేసిన సెంట్రల్ లో బోండా విజయాన్ని అడ్డుకోవడం సాధ్యం కాదని అంటున్నారు.