ఎక్కడైనా నిజాయితీగా రాజకీయం చేసి..ప్రజా మద్ధతు పొంది గెలిస్తే..అది అసలైన గెలుపు అని చెబుతాం…కానీ ఇప్పుడు రాజకీయాలు అలా లేవు. పూర్తిగా మారిపోయాయి. ఇక ఏపీలో వైసీపీ వచ్చాక రాజకీయానికి అర్ధమే మారిపోయిందని కొందరు విశ్లేషకులు మాట్లాడుతున్న మాట.
ఎందుకంటే నిర్మాణాత్మకమైన రాజకీయాలకు వైసీపీ చెల్లు చీటి చెప్పేసింది. ఫేక్ రాజకీయం చేయడం..ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా క్రియేట్ చేయడం..రాజకీయాలతో సంబంధం లేని వారి చేత రాజకీయం మాట్లాడించి..ప్రత్యర్ధులని దెబ్బ తీసే విధంగా పెయిడ్ ఆర్టిస్టులని పెట్టడం, ఇక ప్రత్యర్ధులని దెబ్బ తీయడానికి ప్రశాంత్ కిషోర్ అనే బీహార్ వ్యక్తి చేత రాజకీయ వ్యూహాలు వేయించడం.ఐప్యాక్ టీం అని పెట్టి..దాని ద్వారా అడ్డుగోలుగా వ్యూహాలు వేయడం..ప్రత్యర్ధులని ఇబ్బంది పెట్టడం. వారి వ్యూహాలు వచ్చాకే రాజకీయాల్లో విమర్శలు అంటే బూతులు అనే విధంగా వైసీపీ నేతలు ముందుకెళుతున్నారు. బూతులు తిట్టి ప్రత్యర్ధి పార్టీ నేతలని మానసికంగా ఇబ్బంది పెట్టడం.
ఇక అధికారంలోకి వచ్చాక కేవలం అప్పులు, పన్నుల భారం పెంచి..ఆ డబ్బులని పథకాల రూపంలో కొందరికి పంచడం…అభివృద్ధి లేకపోవడం, ఆదాయం సృష్టించకపోవడం..ప్రజలపై ఆర్ధిక భారం పెరిగేలా చేయడం..ఇక అధికార నేతల అక్రమాలు తారస్థాయిలో ఉండటం, ఇక ఇది ఏంటి అని ప్రశ్నించిన వారిపై దాడులు, కేసులు, అరెస్టులు చేయడం. ఇన్ని చేసి అమాయకంగా తాము ప్రజలకు మంచి చేస్తుంటే..కొందరు దుర్మార్గులు అడ్డుకుంటున్నారని ప్రచారం చేయడం.
ఇక ఇవేమీ వర్కౌట్ కాకపోవడంతో..ఇప్పుడు ప్రతిపక్షాల ఓట్లు లేపేయడం..కొత్తగా దొంగ ఓట్లు సృష్టించడం..ఇలా నానా రకాలుగా గెలుపు కోసం వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు అని విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు. మరి ఎవరేం చేస్తున్నారనేది ప్రజలకు తెలుస్తుంది. ఇక వారు ఇచ్చే తుది తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.