మొత్తానికి ముద్రగడ పద్మనాభం ముసుగు తొలగించారు. తాను జగన్ మనిషి అని బయటపడ్డారు. టిడిపి అధికారంలో ఉండగా కాపు ఉద్యమాల పేరిట వైసీపీ సాకారంతో ముద్రగడ చేసిన రాజకీయం గురించి అందరికీ తెలిసిందే. అప్పుడు చంద్రబాబుకు కాపులని ఎంత యాంటీ చేయాలో అంత చేశారు. జగన్కు ఉపయోగపడేలా చేశారు. చివరికి చంద్రబాబు ఓడిపోయి..జగన్ అధికారంలోకి వచ్చాక ముద్రగడ కాపు ఉద్యమాన్ని పక్కన పెట్టేశారు. దీంతో ముద్రగడ ముసుగు అక్కడే తొలగింది.
కానీ తాజాగా పవన్ పై విమర్శలు చేస్తూ..తాను పిఠాపురం పోటీ చేస్తానని అక్కడ పవన్ పోటీ చేయాలని సవాల్ విసరడంతో ముద్రగడ వైసీపీలోకి వచ్చి పిఠాపురంలో పోటీ చేస్తారని తేలిపోయింది. ఇక ముద్రగడని వైసీపీలోకి తీసుకొస్తే కొంతవరకు కాపుల ఓట్లు కలిసొస్తాయనేది వైసీపీ అంచనా. కానీ కాపులకు ఏమి చేయని జగన్ ప్రభుత్వాన్ని, ఉద్యమం పేరుతో హడావిడి చేసిన ముద్రగడని కాపులు ప్రజలు నమ్మే పరిస్తితి లేదు. పవన్ వైపే మెజారిటీ కాపులు ఉన్నారు. ఇక పిఠాపురం లో పోటీ చేస్తే ముద్రగడకు గెలిచే అవకాశాలు ఉన్నాయా? అంటే..టిడిపి-జనసేన కలిస్తే ముద్రగడకు ఏ మాత్రం గెలిచే ఛాన్స్ లేదని తెలుస్తుంది.
గత ఎన్నికల్లో జగన్ గాలిలో పిఠాపురంలో వైసీపీకి 83 వేల ఓట్లు వచ్చాయి. టిడిపికి 68 వేలు రాగా, జనసేనకు 28 వేలు ఓట్లు వచ్చాయి. ఇలా రెండు పార్టీల మధ్య ఓట్లు చీలడం వల్ల వైసీపీ గెలిచింది. రెండు పార్టీల ఓట్లు కలిపితే 96 వేలు..అంటే వైసీపీ కంటే 13 వేలు ఎక్కువ. ఇది గత ఎన్నికల్లో ఇప్పుడు వైసీపీపై వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో పిఠాపురంలో ముద్రగడ పోటీ చేసిన గెలవడం అసాధ్యమే.