రాఘవేంద్రస్వామి సన్నిధి అయినా మంత్రాలయంలో ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటివరకు వైసీపీ తరపున రెండుసార్లు బాలనాగిరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనే పట్టుదలతో ఉన్న బాలనాగిరెడ్డికి టిడిపి అభ్యర్థి తిక్కారెడ్డి చెక్ పెట్టగలరా??? ఈ ప్రశ్న మంత్రాలయం లోని రాజకీయ నాయకులకే కాదు, ప్రతి ఓటర్లకు కూడా ఆసక్తిగా మారింది.
అంగబలం, అర్ధబలం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేకి సొంత పార్టీ నేతలు సహకరించడం లేదని వార్తలు వస్తున్నాయి. అధికార పార్టీపై ప్రజలలో ఉన్న వ్యతిరేకత అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ నేత తిక్కా రెడ్డి.రెండుసార్లు ఓటమి పొందిన తిక్కారెడ్డి ఈసారైనా తనకు ఓటు వేయమని అభ్యర్థిస్తున్నారు. ఒక్క ఛాన్స్ అంటూ తిక్కారెడ్డి ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. తిక్కారెడ్డికి కలుస్తుందా లేదా చూడాలి.
ఇక తిక్కారెడ్డికి నియోజక వర్గంలో రెండు సార్లు ఓటమి పొందాడని సానుభూతి కూడా ఉంది. మామూలుగానే వైసీపీపై వ్యతిరేకత ఉంది. అటు బాలనాగిరెడ్డికి వ్యతిరేకత స్పష్టంగా ఉంది. ఇలాంటి పరిస్తితుల్లో మంత్రాలయంలో టిడిపి పైచేయి సాధించే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే అక్కడ రెడ్డి వర్గం పట్టు ఎక్కువ. ఇప్పటివరకు వారు మెజారిటీ వైసీపీ వైపే ఉన్నారు. కానీ ఇప్పుడు వారిలో కూడా మార్పు ఉంది. టిడిపి వైపు రెడ్డి వర్గం చూస్తుంది. మిగిలిన బిసి వర్గం సైతం టిడిపికి సపోర్ట్ పెరిగింది. దీని బట్టి చూస్తే వైసీపీకి టిడిపి గట్టి పోటీ ఇవ్వనుంది. మొత్తానికి మంత్రాలయంలో ఎన్నికల పోరు రసవత్తరంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.