కులాల మద్య కుంపటి పెట్టి ప్రత్యర్ధులని దెబ్బతీయడంలో వైసీపీ ఆరితేరిపోయిందనే చెప్పాలి. గత ఎన్నికల ముందు ఏ విధంగా టిడిపిని టార్గెట్ చేసి కుల రాజకీయం చేసిందో చెప్పాల్సిన పని లేదు. టిడిపి అంటే కమ్మ కులం అనే విధంగా ముద్రవేసింది. కానీ టిడిపిలో అన్నీ కులాల వారికి ప్రాధాన్యత దక్కింది. అదేవిధంగా ఎన్నికల ముందు టిడిపి-జనసేన మధ్య ఉన్న రాజకీయ వైరుధ్యాలని కమ్మ-కాపు కులాల మధ్య చిచ్చు పెట్టేలా చేశారు. దాని వల్ల కూడా ఎన్నికల్లో వైసీపీ లబ్ది పొందింది.
ఇక అధికారంలోకి వచ్చాక కూడా వైసీపీ అదేబాటలో వెళుతుంది. ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గరపడటం..అటు టిడిపి-జనసేన కలవడంతో మరోసారి కమ్మ-కాపు కులాల మధ్య చిచ్చు పెట్టేలా రాజకీయం నడుపుతుంది. అసెంబ్లీ సాక్షిగా కులాల కుంపటికి తెరలేపింది.
అసెంబ్లీ దేవాలయం తో సమానం. అసెంబ్లీలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పురుడు పోసుకుంటాయి. రాష్ట్ర అభివృద్ధికి అంకురార్పణ జరిగేది అసెంబ్లీలోనే, కానీ అసెంబ్లీ కుల రాజకీయాలకు వేదికగా మారింది. అసెంబ్లీలో అధికార నేతల ప్రవర్తన మాట తీరు సామాన్యునికి సైతం భయం వేసేలా ఉన్నాయి.
గౌరవప్రదమైన మంత్రి ఒక సామాజిక వర్గానికి ప్రాధాన్యతనిస్తూ మరో సామాజిక వర్గం వారిని కించపరుస్తూ మాట్లాడటం అందరినీ విస్మయానికి గురిచేస్తుంది. అధికార పార్టీ మంత్రి అంబటి రాంబాబు, టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణల మధ్య అసెంబ్లీలో మాటల యుద్ధం జరిగింది. కానీ అక్కడ ఎక్కడ కులాల ప్రస్తావన బాలయ్య తీసుకు రాలేదు. కానీ ట్విట్టర్ లో అంబటి తాను ఎవరికి భయపదను మీసం తిప్పితే ఊరుకోవడానికి ఇక్కడ ఉన్నది కాపు బిడ్డను..నాది తెలుగు గడ్డ అంటూ హడావిడిగా ట్వీట్ చేశారు.
అసలు బాలయ్య ఎక్కడ కులం గురించి మాట్లాడలేదు. అంటే బాలయ్య కమ్మ కులం..కాపు కులానికి చెందిన తనని అంటున్నారనే విధంగా అంబటి కాపు కులాన్ని…కమ్మ కులంపైకి రెచ్చగొట్టి..వైసీపీ ప్లాన్ లో భాగంగా కులాల మధ్య చిచ్చు పెట్టాలని అనుకున్నారు. కానీ కాపు కులాన్ని కించపరుస్తూ గతంలో చాలా మాటలు అన్నారు. పైగా ఇది వైసీపీ స్కెచ్ అని అందరికీ తెలుసు. అందుకే ఎవరు అంబటి మాటలని లెక్క చేయలేదు. కులాల మధ్య ఎలాంటి విభేదాలు రాలేదు. వైసీపీ ప్లాన్ రివర్స్ అయింది.