విశాఖ రాజధాని అంటూ హడావిడి చేస్తున్న సరే అక్కడ ప్రజలు వైసీపీని నమ్మడం లేదు..ఎందుకంటే వైసీపీ అధికారంలోకి వచ్చాక విశాఖని ఏ విధంగా నాశనం చేశారో చెప్పాల్సిన పని లేదు. అందుకే అక్కడి ప్రజలు టిడిపి వైపే ఉంటున్నారు. ఈ సారి విశాఖలో టిడిపి మంచి విజయాన్ని నమోదు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే విశాఖలో టిడిపిలో కొన్ని సీట్ల విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే కొన్ని సీట్లలో అభ్యర్ధులు ఫిక్స్ అయ్యారు.
కానీ కొన్ని చోట్ల అభ్యర్ధులు సెట్ కాలేదు. ముఖ్యంగా పార్టీలో కీలక నేతలుగా ఉన్న గంటా శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావుల సీట్ల విషయంలో క్లారిటీ లేదు. ప్రస్తుతం గంటా విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన మళ్ళీ అక్కడ పోటీ చేయడం కష్టం. పైగా పొత్తులో భాగంగా ఆ సీటు జనసేన అడిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో గంటాని గాజువాక పంపుతారని టాక్. అదే సమయంలో గాజువాక ఇంచార్జ్ గా ఉన్న పల్లా శ్రీనివాసరావుని విశాఖ ఎంపీగా బరిలో దింపుతారని అంటున్నారు.
ఇక గత ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన శ్రీభరత్ ని భీమిలి ఎమ్మెల్యేగా పంపిస్తారని అంటున్నారు. అయితే పొత్తులో భాగంగా ఆ సీటుని కూడా జనసేన అడుగుతున్నట్లు తెలుస్తుంది. దీంతో భరత్ సీటుపై ఇంకా క్లారిటీ రావాలి. అదే సమయంలో బిజేపితో కూడా పొత్తు ఉంటే సమీకరణాలు ఇంకా మారతాయి.
ఇలా విశాఖలో కొన్ని సీట్లలో క్లారిటీ లేదు. అయితే విశాఖ నగరంలో ఈస్ట్ లో వెలగపూడి రామకృష్ణ బాబు, వెస్ట్ లో గణబాబు పోటీ చేయడం ఖాయం. ఇక సౌత్ లో గండి బాబ్జీ ఉన్నారు..కానీ ఆయన సీటుపై క్లారిటీ లేదు.