అన్నమయ్య జిల్లా, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం కింద వచ్చే అసెంబ్లీ నియోజకవర్గం తంబళ్ళపల్లె. ఇక్కడ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఉన్నారు. తంబళ్ళపల్లె వెనుకబడిన ప్రాంతం తాగునీరు, సాగునీటికి కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడి నుండి వలసలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో వర్గ రాజకీయాలు, హత్య రాజకీయాలకు పెట్టింది పేరని రాజకీయం వర్గాల వారు అంటున్నారు. ఈ నియోజకవర్గంలో ఎక్కువగా రెడ్డి సామాజిక వర్గం వారే గెలుస్తూ వచ్చారు, కానీ 2014లో యాదవ కులానికి చెందిన శంకర్ యాదవ్ గెలుపొందారు.
శంకర్ యాదవ్ 2018లో ద్వారకానాథ్ రెడ్డి పై పోటీ చేసి ఓటమి పొందారు. ఆ తర్వాత శంకర్ యాదవ్ వ్యాపార నిమిత్తం బెంగళూరులోనే ఉంటున్నారని, క్యాడర్ కు అందుబాటులో ఉండడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ లోకేష్ యువ గళం పాదయాత్రలో శంకర్ యాదవ్ అన్ని దగ్గరుండి చూసుకున్నారని, యువ గళం పాదయాత్రని విజయవంతం చేశారని రాజకీయ వర్గాల వారు అంటున్నారు. లోకేష్ యువ గళం పాదయాత్రతో తంబళ్లపల్లిలో టిడిపి ఓటు బ్యాంకు పెరిగిందని చెప్పవచ్చు. దానికి తోడు టిడిపి జనసేన పొత్తు వల్ల వచ్చే ఓట్లు కూడా టిడిపికి ప్లస్ అవుతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి పై ఉన్న అవినీతి ఆరోపణలు, ఇసుక అక్రమ రవాణా, హత్య రాజకీయాలు, దొంగ ఓట్లు ప్రజలలో ఉన్న వ్యతిరేకత ఇవన్నీ టిడిపి వారు తమకు కలిసి వస్తాయని చెబుతున్నారు. కానీ ఈసారి టిడిపి తంబళ్ళపల్లె లో గెలవాలంటే పెద్దిరెడ్డి తో హోరాహోరీ పోరు తప్పదని రాజకీయ వర్గాలు చెబుతున్నారు.