స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ ప్రభుత్వం.. చంద్రబాబునాయుడుని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ సంఘటనతో రాష్ట్రంలోని టిడిపి శ్రేణులంతా ఆందోళనకు గురయ్యారు. విడుదల చేయాలంటూ ర్యాలీలు ధర్నాలు నిరసనలు తెలిపారు. కానీ సిబిఐ కోర్టు చంద్రబాబుకు రిమాండ్ ఇచ్చి రాజమహేంద్రవరం జైలులో ఉంచారు.
జైల్లో ఉన్న చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ తమ మద్దతును తెలియజేయాలని, పోస్ట్ కార్డుల ద్వారా తమ మద్దతును తెలియజేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. నాయకుల పిలుపుని అందుకున్న తెలుగుదేశం అభిమానులు, కార్యకర్తలు పోస్ట్ కార్డుల ద్వారా తమ మద్దతును రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్ లో, స్నేహ బ్లాక్ చంద్రబాబు నాయుడు గారి అడ్రస్ తో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ ఏడు లక్షల మంది పోస్టు కార్డుల చంద్రబాబు నాయుడుకు మద్దతుగా పంపారని తెలుగుదేశం నాయకులు అంటున్నారు.
అధికారికంగా 30 వేల వరకు రిజిస్టర్ పోస్టులు, స్పీడ్ పోస్ట్ లు, పోస్ట్ కార్డులు చంద్రబాబు నాయుడుకి పంపారని జైలు అధికారులు చెబుతున్నారు. కానీ టిడిపి నాయకులు మాత్రమే దాదాపు పది లక్షల మంది చంద్రబాబు నాయుడుకు మద్దతుగా తమ పోస్ట్ కార్డులను పంపామని అధికార ప్రభుత్వం తన ఒత్తిడితో ఉత్తరాలన్నీ చంద్రబాబు నాయుడుకి చేరకుండా చేశారు అని చేశారు అని ఆరోపిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ తపాలా సంస్థ వారైతే పది లక్షల పోస్ట్ కార్డుల లోటు ఉందని, ఆ కార్డులకు తాము ఆర్డర్ పెట్టామని చెబుతున్నారు. చంద్రబాబునాయుడుకి మద్దతుగా సామాన్య ప్రజలే కాదు మామూలు టిడిపి కార్యకర్తలు 25 లక్షల మంది ఉన్నారని, వారందరూ ఉత్తరాలు రాసిన చంద్రబాబు నాయుడుకు మద్దతుగా లక్షలలోని ఉత్తరాలతో జైలులో చంద్ర బాబు నాయుడు గది మొత్తం నింది పోతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.