ఉమ్మడి కృష్ణా జిల్లాలో తిరువూరు, నూజివీడు పక్క పక్కనే ఉండే నియోజకవర్గాలు…ఒకప్పుడు ఇవి టిడిపి కంచుకోటలు..కానీ ఇప్పుడు వైసీపీ కంచుకోటలు. గత రెండు ఎన్నికల్లో ఈ సీట్లలో టిడిపికి ఊహించని ఓటములు ఎదురవుతున్నాయి. 2014, 2019 ఎన్నికల్లో టిడిపి వరుసగా ఓడిపోయింది. అసలు తిరువూరులో 1999 తర్వాత వరుసగా ఓడిపోతునే వస్తుంది. గత రెండు ఎన్నికల్లో వైసీపీ నుంచి రక్షణనిధి గెలుస్తూ వచ్చారు.
కానీ ఎమ్మెల్యేగా రక్షణనిధి తిరువూరులో చేసిన అభివృద్ధి పెద్దగా లేదు. ఈ సారి ఆయనని మార్చాలని సొంత పార్టీ వాళ్ళే మాట్లాడుతున్నారు. మళ్ళీ సీటు ఇస్తే తామే ఓడిస్తామని అంటున్నారు. వైసీపీలో ఇలాంటి పరిస్తితి ఉన్న దాన్ని ఉపయోగించుకోలేని స్థితిలో టిడిపి కనిపిస్తోంది. మొన్నటివరకు ఇక్కడ టిడిపి వెనుకబడే ఉంది. ఇటీవలే టిడిపి ఇంచార్జ్ దేవదత్ కాస్త దూకుడుగా పనిచేస్తున్నారు. ఇక్కడ టిడిపిలో గ్రూపులు ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే స్వామీదాస్, టిడిపి నేత వాసం మునియ్య..ఇలా ఎవరికి వారికి సెపరేట్ గ్రూపు ఉంది.
అందుకే ఇటీవల చంద్రబాబు వీరికి క్లాస్ పీకి అంతా కలిసి పనిచేయాలని దేవదత్కు సహకరించాలని కోరారు. దీంతో ఇప్పుడుప్పుడే తిరువూరుపై టిడిపి పట్టు సాధిస్తుంది. ఇక్కడ గెలవడానికి ఇంకా కష్టపడాలి. అటు నూజివీడు విషయానికొస్తే వైసీపీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ బలమైనే నేత. కాకపోతే అక్కడ ఇప్పుడు యాంటీ ఉంది. ఇటు టిడిపి ఇంచార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు హార్డ్ వర్క్ చేస్తున్నారు.
కాకపోతే టిడిపిలో కొందరు నేతలు సహకరించడం లేదు. దీని వల్ల నూజివీడులో టిడిపికి ఇబ్బందులు ఉన్నాయి. అంటే అటు తిరువూరు, ఇటు నూజివీడుల్లో టిడిపి నేతలు కలిసి పనిచేయకపోవడమే మైనస్..కలిసి పనిచేస్తే ఈ సారి రెండు సీట్లని కైవసం చేసుకోవడం ఖాయం.
ReplyReply allForward |