ఉమ్మడి గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం…డౌట్ లేకుండా ఇది టిడిపి కంచుకోట. 1983, 1985 ఎన్నికల్లో ఇక్కడ టిడిపి గెలిచింది. 1989లో కాంగ్రెస్ గెలిచిన మళ్ళీ 1994, 1999 ఎన్నికల్లో టిడిపి నుంచి ఆలపాటి రాజా గెలిచారు. 2004లో ఓడిపోయారు. తర్వాత ఈ స్థానం ఎస్సీ రిజర్వ్ చేశారు. దీంతో ఆలపాటి తెనాలికి వెళ్ళి పోటీ చేశారు.
ఇక వేమూరులో ఎస్సీ టిడిపి నేత నక్కా ఆనందబాబు బరిలో దిగి 2009 ఎన్నికల్లో విజయం సాధించారు. అలాగే 2014 ఎన్నికల్లో కూడా సత్తా చాటారు. టిడిపి హయాంలో చంద్రబాబు కేబినెట్ లో పనిచేశారు. వేమూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. కానీ 2019 ఎన్నికల్లో వైసీపీ వేవ్ లో నక్కా ఓడిపోయారు. వైసీపీ నుంచి మేరుగు నాగార్జున గెలిచారు. ఈయన జగన్ కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు. మంత్రిగా ఉన్న సరే వేమూరులో పెద్దగా అభివృద్ధి లేదు. పైగా ఇక్కడ ఇసుకలో అక్రమాలు పెరిగాయనే ఆరోపణలు వస్తున్నాయి.
ఇక్కడ బలాబలాలు చూస్తే..ఇద్దరు ఎస్సీ వర్గంలో బలమైన నేతలే. అయితే వేమూరులో ఎస్సీ ఓట్లు ఎక్కువ. గత ఎన్నికల్లో వీరు వైసీపీ వైపే ఎక్కువ మొగ్గు చూపారు. కానీ ఈ సారి సగం టిడిపి వైపుకు వచ్చే ఛాన్స్ ఉంది. అటు బిసి ఓటింగ్ కూడా గెలుపోటములని డిసైడ్ చేస్తుంది. బిసిలు మెజారిటీ టిడిపి వైపు ఉన్నారు.
ఇక కమ్మ వర్గం ఓట్లు ఎక్కువే..గత ఎన్నికల్లో 40 శాతం పైనే వీరు వైసీపీకి మద్ధతు ఇచ్చారు..కానీ ఈ సారి ఆ పరిస్తితి లేదు. కమ్మ ఓట్లు టిడిపికి వన్ సైడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓవరాల్ గా వేమూరులో టిడిపికి లీడ్ ఉంది.