ఆ రెండు నియోజకవర్గాలు వైసీపీ కంచుకోటలు..పైగా రెడ్డి సామాజికవర్గం హవా ఉన్న స్థానాలు..అటు ఎస్సీ వర్గం ఓట్లు కూడా ఎక్కువే.అందుకే గత కొన్నేళ్ళ నుంచి ఆ స్థానాల్లో టిడిపి గెలుపు అనేది అసాధ్యంగా మారింది. 2014 ముందు వరకు కాంగ్రెస్, తర్వాత నుంచి వైసీపీ హవా నడుస్తుంది. కానీ ఈ సారి ఎన్నికల్లో వైసీపీకి చెక్ పెట్టి టిడిపి జెండా ఎగరవేయాలని టిడిపి రెడ్డి నేతలు చూస్తున్నారు.
వైసీపీ కంచుకోటలుగా ఉన్న ఆ రెండు స్థానాలు ఏవో కాదు..ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న గిద్దలూరు, మార్కాపురం..ఈ రెండు సీట్లు వైసీపీ అడ్డాలు. గత రెండు ఎన్నికల్లో ఈ రెండు చోట్ల వైసీపీ గెలుస్తూ వస్తుంది. రెండు పక్క పక్కనే ఉండే నియోజకవర్గాలు. గిద్దలూరు విషయానికొస్తే..ఇక్కడ టిడిపి చివరిగా గెలిచింది..1999 ఎన్నికల్లో అక్కడ నుంచి వరుస ఓటములే. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. 2014లో వైసీపీ నుంచి అశోక్ రెడ్డి గెలిచారు..ఆయన నెక్స్ట్ టిడిపిలోకి వచ్చారు. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి అన్నా రాంబాబు పోటీ చేసి దాదాపు 81 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు.
ఇంత భారీ మెజారిటీతో గెలిచిన గిద్దలూరు ప్రజలకు ఒరిగింది ఏమి లేదు..అభివృద్ధి లేదు..సాగునీరు, తాగునీటి కష్టాలు.ఇక్కడ టిడిపి ఇంచార్జ్ అశోక్ రెడ్డి దూకుడుగా ఉన్నారు. వరుసగా వైసీపీ శ్రేణులని టిడిపిలో చేర్చుకుంటున్నారు. చాలావరకు తన బలం పెంచుకున్నారు. కాకపోతే 80 వేల మెజారిటీ కరిగించడం మామూలు విషయం కాదు.
ఇక మార్కాపురం..టిడిపి ఇక్కడ రెండుసార్లే గెలిచింది. 1985, 2009 ఎన్నికల్లోనే…2014, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. వైసీపీ ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి పనితీరు ఏ మాత్రం బాగోలేదు. అటు టిడిపి నేత కందుల నారాయణ రెడ్డి బలం పెంచుకున్నారు. ఆ మధ్య యాక్సిడెంట్ అయిన..వీల్ చైర్ లో ఉంటూనే రాజకీయం నడిపిస్తున్నారు. ఆ నాలుగేళ్లలో టిడిపి బలం పెరిగింది. మరి ఈ ఇద్దరు రెడ్లు ఈ సారి వైసీపీ కంచుకోటలని బద్దలుగొట్టగలరో లేదో చూడాలి.
ReplyReply allForward |