ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఈ సారి వైసీపీకి చెక్ పెట్టేలా టిడిపి వ్యూహాలు రచిస్తుంది. గత ఎన్నికల్లో జగన్ గాలిలో 9కి 9 సీట్లు వైసీపీ గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది..కానీ ఈ సారి ఆ ఛాన్స్ లేకుండా టిడిపి ఆధిక్యం సాధించాలని చూస్తుంది. ఇప్పుడు ఆ దిశగానే విజయనగరంలో బలమైన అభ్యర్ధులని రంగంలోకి దింపడానికి కసరత్తు చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో 9 సీట్లు ఉంటే..గత ఎన్నికల్లో 9 సీట్లు వైసీపీ గెలుచుకుంది. ఈ సారి ఆ పరిస్తితి లేదు. ప్రభుత్వంపై వ్యతిరేకత, ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది. టిడిపి నేతలు బలపడుతున్నారు. దీంతో ఈ సారి విజయనగరంలో టిడిపి జోరు కొనసాగేలా ఉంది. అలాగే బలమైన అభ్యర్ధులని రంగంలోకి దింపుతున్నారు. మొదట టిడిపి గెలుపుకు దూరమైన బొబ్బిలిలో మాజీ మంత్రి సుజయకృష్ణ రంగరావు సోదరుడు బేబీ నాయన పోటీ చేస్తున్నారు. ఈయన ఇంచార్జ్ గా దూసుకెళుతున్నారు. ఇక్కడ టిడిపి గెలుపు ఫిక్స్.
అటు టిడిపి కంచుకోట విజయనగరం అసెంబ్లీలో అశోక్ గజపతి రాజు పోటీ చేస్తారా? ఆయన కుమార్తె అతిథి పోటీ చేస్తారా? అనేది క్లారిటీ లేదు. కానీ ఇద్దరులో ఒకరు ఫిక్స్..అలాగే గెలుపు వన్సైడ్. మరో కంచుకోట శృంగవరపుకోటలో కోళ్ళ లలితకుమారి, గంప కృష్ణ మధ్య పోటీ ఉంది. ఎవరు పోటీ చేసిన విజయం ఖాయమే. ఇక నెల్లిమర్లలో బంగార్రాజు బరిలో ఉంటారు. ఇక్కడ టిడిపికి లీడ్ ఉంది.
సాలూరులో గుమ్మడి సంధ్యారాణి పోటీ చేసే ఛాన్స్ ఉంది..ఇక్కడ టిడిపి గెలుపు కష్టమే. కురుపాంలో ఇంకా క్లారిటీ లేదు..కానీ ఇక్కడ కూడా కాస్త కష్టపడాలి. పార్వతీపురంలో ఇటీవలే విజయచంద్రని ఇంచార్జ్ గా పెట్టారు. ఇక్కడ హోరాహోరీ ఉంది. చీపురుపల్లిలో నాగార్జున పోటీ చేస్తారు..కానీ ఇక్కడ బొత్స సత్యనారాయణకు చెక్ పెట్టడం కష్టం. గజపతినగరంలో అప్పలనాయుడు బరిలో ఉండే ఛాన్స్ ఉంది..ఇక్కడ కూడా టఫ్ ఫైట్ ఉంది. ప్రస్తుతం జిల్లాలో టిడిపి 4, వైసీపీ 3 సీట్లలో లీడ్ లో ఉన్నాయి. 2 చోట్ల టఫ్ ఫైట్.
ReplyReply allForward |