రెండుసార్లు బ్యాడ్ లక్ ప్లస్ ఓట్ల చీలికతో మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర ఓటమి పాలయ్యారు. 2009లో ప్రజారాజ్యం వల్ల, 2019లో జనసేన వల్ల ఓట్లు చీలి కొల్లు ఓడిపోయారు..అటు పేర్ని నాని గెలిచారు. అయితే 2014లో కొల్లు గెలిచి..మంత్రిగా చేశారు..బందరులో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. కానీ 2019లో నాని గెలిచి మంత్రి అయిన జరిగిన అభివృద్ధి శూన్యమే.
అయితే ఈ సారి ఎన్నికల్లో తాను పోటీ చేయనని, తన వారసుడు పోటీ చేస్తారని పేర్ని చెబుతున్నారు. అందుకే తగ్గట్టుగానే పేర్ని వారసుడు కృష్ణమూర్తి నియోజకవర్గంలో తిరుగుతున్నారు.ఇంకా చెప్పాలంటే ఒక అనధికార ఎమ్మెల్యే లెక్క ఉన్నారు. కానీ పేర్ని వారసుడుపై జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు..కాకపోతే పేర్ని ఇప్పటికే జగన్కు చెప్పేసారట. తన వారసుడుకి సీటు ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. కానీ జగన్ మాత్రం ఈ సారి కూడా తనతో పాటు పేర్ని నాని పోటీ చేయాలని సూచించారట.
దీంతో మచిలీపట్నంలో ఇంకా ఎవరు పోటీ చేస్తారనేది క్లారిటీ లేదు. కానీ అక్కడ వైసీపీ శ్రేణులు, ప్రజలు వైసీపీ నుంచి పేర్ని వారసుడు పోటీ చేస్తారని ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ఇక టిడిపి నుంచి కొల్లు పోటీ చేయడం ఖాయమే. ప్రస్తుతం ఆయనకే లీడ్ ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆయనపై కేసులు పెట్టడం, జైలుకు పంపడం..పెద్ద ప్లస్.
ఇక పేర్ని వారసుడు పోటీ చేస్తే కొల్లు గెలుపు సులువు అని చర్చ నడుస్తోంది. అందుకే మళ్ళీ వైసీపీ స్ట్రాటజీ మార్చి..పేర్నిని బరిలో దింపే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. తప్పనిసరి పరిస్తితుల్లో మళ్ళీ పోటీ చేస్తున్నా..ఇదే చివరి ఛాన్స్ అన్నట్లు పేర్నిని రంగంలోకి దింపితే సానుభూతి కలిసొస్తుందని చూస్తున్నారు. కానీ బందరులో వైసీపీ ఎన్ని ప్రయోగాలు చేసిన ఈ సారి కొల్లు విజయాన్ని అడ్డుకోవడం కష్టమే అంటున్నారు.
ReplyReply allForward |