యనమల రామకృష్ణుడు..టిడిపిలో నెంబర్ 2 లాంటి నేత..6 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. పలుమార్లు మంత్రిగా చేశారు. స్పీకర్, ఎమ్మెల్సీ ఇలా అనేక పదవులు చేపట్టారు. ఇక అలాంటి నేతకే చెక్ పెడుతూ…రెండుసార్లు గెలిచి మంత్రి పదవి దక్కించుకుని మూడోసారి కూడా గెలవడానికి ప్రయత్నిస్తున్నారు దాడిశెట్టి రాజా..తుని నియోజకవర్గంలో మళ్ళీ యనమల ఫ్యామిలీకి చెక్ పెట్టాలని చూస్తున్నారు.
అసలు తుని అంటే యనమల అడ్డా…1983 నుంచి 2004 వరకు వరుసగా 6 సార్లు గెలిచారు. 2009లో ఓడిపోయారు..ఇక 2014లో పోటీ చేయకుండా తన సోదరుడు కృష్ణుడుని టిడిపి లో పోటీకి దింపారు. కానీ రాజా వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. 2019లో అదే సీన్. ఇక రాజా మంత్రి పదవి దక్కించుకుని దూసుకుని వెళుతున్నారు. దీంతో రాజా దూకుడుకు బ్రేక్ వేయాలని కృష్ణుడుని పక్కన పెట్టి..యనమల కుమార్తె దివ్యని తుని ఇంచార్జ్ గా పెట్టారు. ఇంచార్జ్ గా వచ్చాక దివ్య దూకుడుగా పనిచేస్తున్నారు. తమ బలాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే ఎంత చేసిన తునిలో రాజాకే ఆధిక్యం ఉందని లేటెస్ట్ సర్వేల్లో తేలింది. ఇప్పటికీ అక్కడ టిడిపి వెనుకబడే ఉన్నట్లు సమాచారం. దీంతో రాజాకు బ్రేకులు వేసేందుకు యనమల ఫ్యామిలీ గట్టిగానే కష్టపడుతుంది. గతంలో కొన్ని వర్గాల ఓట్లని దూరం చేసుకున్నారు..ఇప్పుడు వారిని దగ్గర చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. కార్యకర్తలని కలుపుకుని వెళుతున్నారు.
అదే సమయంలో ఇక్కడ జనసేనకు 15-20 వేల ఓటు బ్యాంకు ఉంటుంది. గత ఎన్నికల్లో జనసేనకు 7 వేల ఓట్ల వరకు పడ్డాయి. ఇప్పుడు ఆ బలం కాస్త పెరిగింది. ఇక టిడిపికి జనసేన మద్ధతు ఇస్తే..రాజా హ్యాట్రిక్కు బ్రేకులు వేయవచ్చు. చూడాలి మరి ఈ సారి తునిలో యనమల ఫ్యామిలీ సత్తా చాటుతుందో లేదో.