రాజకీయాల్లో గెలుపోటములు అనేవి సహజం..ఈ డైలాగ్ పాతదే అయిన ఇదే నిజం. రాజకీయాలు ఎప్పుడైనా మారతాయి. గెలిచిన వారు శాశ్వతంగా గెలుస్తారని లేదు..ఓడిన వారు శాశ్వతంగా ఓడిపోతారని లేదు. అయితే ఇప్పుడు ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ శాశ్వత అధికారం తమదే అనుకుంటుంది. ఇంకా టిడిపి గెలిచే ప్రసక్తి లేదని అధికార బలంతో వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు.
ఇక పదే పదే లోకేష్, పవన్ ఓటములపై సెటైర్లు వేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా రోజా..దమ్ముంటే ఇద్దరు ఎమ్మెల్యేలుగా గెలవాలని సవాల్ చేస్తున్నారు. అసలు వారు జీవితంలో ఎమ్మెల్యేలు కాలేరు అని ఎగతాళి చేస్తున్నారు. మరి రోజా అన్నట్లే జరుగుతుందా అంటే..జరిగే ప్రసక్తి లేదనే చెప్పవచ్చు. అసలు ఆ ఇద్దరు గత ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి ఓడిపోయారు. అక్కడితో అయిపోయిందని అనుకోవడానికి లేదు. మళ్ళీ గెలుపు దిశగా వారు వెళుతున్నారు.
లోకేష్..మంగళగిరి బరిలో ఓడిపోయారు..ఓడిపోయాక అక్కడ ప్రజలకు అండగా నిలబడ్డారు. సొంత డబ్బులు ఖర్చు పెట్టి పనులు చేశారు. వైసీపీ ఎమ్మెల్యే చేసిందేమి లేదు. దీంతో ప్రజలు లోకేష్ వైపు చూస్తున్నారు. ఈ సారి మంచి మెజారిటీతో లోకేష్ని గెలిపించాలని భావిస్తున్నారు. అటు పవన్..భీమవరం, గాజువాకలో పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి భీమవరం ఒక్క సీటులోనే పోటీ చేసి సత్తా చాటాలని చూస్తున్నారు. అక్కడ పవన్కు గెలుపు సులువే. ఇద్దరు నేతలకు ఈ సారి గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఎటు తిరిగి రోజాకే గెలుపు డౌట్ గత రెండు ఎన్నికల్లో తక్కువ ఓట్లతోనే గెలిచారు. ఈ సారి గెలిచే అవకాశాలు శూన్యం. అసలు సొంత పార్టీ వాళ్లే ఆమెని ఓడించేలా ఉన్నారు. ఇంకా నగరిలో ఆమె గెలిస్తే ఒట్టు అంటున్నారు.