ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అంటే టిడిపికి కంచుకోట అనే సంగతి తెలిసిందే. అక్కడ టిడిపి కంచుకోటలు చాలానే ఉన్నాయి. ఎప్పుడు మంచి ఫలితాలే రాబట్టేది. కానీ గత ఎన్నికల్లోనే దెబ్బతింది. అయినా వెంటనే పుంజుకునే జిల్లాలో టిడిపి పట్టు సాధించింది. ఇప్పుడు లీడ్ లో ఉంది. అయితే టిడిపి ఎంత లీడ్ లో ఉన్న కొన్ని స్థానాల్లో వెనుకబడే ఉంది. అందులో పాలకొండ ఒకటి.
మొదట నుంచి పాలకొండ టిడిపికి కలిసిరాని రిజర్వడ్ నియోజకవర్గం. 1983, 1985, 1994, 2004 ఎన్నికల్లోనే అక్కడ టిడిపి గెలిచింది. ఇక గత రెండు ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుంది. వైసీపీ నుంచి విశ్వసరాయి కళావతి గెలుస్తూ వస్తున్నారు. అయితే 2014లో టిడిపి గెలుపు దగ్గరకొచ్చి బోల్తా కొట్టింది. టిడిపి నుంచి నిమ్మక జయకృష్ణ పోటీ చేసి కేవలం 1600 ఓట్ల తేడాతో ఓడింది. 2019లో జగన్ గాలిలో 18 వేల ఓట్ల మెజారిటీ తో ఓడిపోయారు. అయితే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కళావతి పాలకొండకు చేసేదేమీ లేదు. అందరిలాగానే పథకాలు వస్తున్నాయి. అభివృద్ధి శూన్యం. గిరిజన ప్రాంతాల్లో సరైన రోడ్లు, ఆసుపత్రుల సౌకర్యాలు కూడా లేవు.
దీంతో ఆమెపై ప్రజా వ్యతిరేకత ఉంది. కాకపోతే దాన్ని ఉపయోగించుకుని బలపడటంలో నిమ్మక వెనుకబడ్డారు. పైగా గిరిజనుల పథకాలకు జగన్ వైపు ఉన్నారు. దీంతో పాలకొండలో వైసీపీకే ఆధిక్యం ఉందని సర్వేలు చెబుతున్నాయి. అయితే ఇక్కడ టిడిపికి ఇంకా బలపడే అవకాశాలు ఉన్నాయి. టిడిపి మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. జగన్ కంటే ఇంకా మంచి పథకాలు ఇస్తున్నామని ప్రజలకు చెప్పాలి. వైసీపీ వ్యతిరేక ఓటుని ఏకం చేయాలి..అప్పుడు ఆటోమేటిక్ గా టిడిపికి ప్లస్. అలా జరగకపోతే మళ్ళీ పాలకొండలో గెలవడం కష్టమే.