కడప అంటే వైసీపీ కంచుకోట…జగన్ అడ్డా..అక్కడ టిడిపికి బలం తక్కువే. గత ఎన్నికల్లో 10కి 10 సీట్లు వైసీపీనే గెలుచుకుంది. అయితే 10 సీట్లు ఇచ్చిన, జగన్ సిఎం అయినా, ఒక మంత్రి ఉన్నా సరే కడపకి ఒరిగింది ఏమి లేదు.. అభివృద్ధి పెద్దగా జరగలేదు. పథకాలు మాత్రం వస్తున్నాయి కానీ వాటితో ఒరిగేది ఏమి లేదు. దీంతో కడప ప్రజల్లో మార్పు వస్తుంది. అటు లోకేష్ పాదయాత్ర టిడిపికి కలిసొస్తుంది.
టిడిపి అనూహ్యంగా బలపడుతుంది. అందుకే టిడిపిలో పోటీ చేయడానికి నేతలు క్యూ కట్టారు. ఒకో సీటులో ఇద్దరు, ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారు. టిడిపికి గెలుపు అవకాశాలు ఉన్న ప్రొద్దుటూరు సీటులో ఇంచార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వరదరాజులు రెడ్డి, లింగా రెడ్డి పోటీ పడుతున్నారు. ఇటు మైదుకూరులో పుట్టా సుధాకర్ యాదవ్ తో పాటు డిఎల్ రవీంద్రా రెడ్డి ఉన్నారు. కడప సీటు కోసం ఇంచార్జ్ అమీర్ తో పాటు..కార్పొరేటర్ ఉమాదేవి, రాజంపేట అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి భార్య మాధవి ఇలా పలువురు రేసులో ఉన్నారు.
బద్వేలులో ఓబుళాపురం రాజశేఖర్, ఓ ప్రభుత్వ ఉద్యోగి, మాజీ గవర్నమెంట్ ప్రాసిక్యూటర్ గుర్రప్ప సీటు రేసులో ఉన్నారు. రాయచోటి సీటు కోసం రమేశ్ రెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి, రాంప్రసాద్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఇక రాజంపేట సీటు కోసం చెంగల్రాయుడు తో పాటు జగన్మోహన్ రాజు రేసులో ఉన్నారు.
అటు రైల్వేకోడూరు సీటు కోసం నరసింహాప్రసాద్, విశ్వనాథ నాయుడు పోటీ పడుతున్నారు. ఇలా ఎక్కడకక్కడ కడపలో టిడిపి సీట్ల కోసం పోటీ పెరిగింది. మరి చివరికి సీట్లు ఎవరు దక్కించుకుని గెలుస్తారో చూడాలి.