మీడియా ఎప్పుడు అధికార పార్టీలకే ఎక్కువ సపోర్ట్ గా ఉంటుందనే విషయం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బిజేపికి..ఎన్ని నేషనల్ మీడియా సంస్థలు బాకా ఊదుతున్నాయనేది చెప్పాల్సిన పని లేదు. బిజేపికి సపోర్ట్ మీడియా సంస్థలు ఎన్ని ఉన్నాయో తెలిసిందే. అయితే ఆ మీడియా సృష్టించేది ప్రతిదీ నమ్మడం అనేది కష్టమైన విషయమే.
తాజాగా ఎన్డీయే మీటింగ్ పై మీడియాలో కథనాలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఈ నెల 18న ఎన్డీయే మిత్రపక్షాల మీటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమావేశానికి టిడిపి కూడా వెళుతుందని బిజేపి అనుకూల మీడియా సంస్థలు కథనాలు ఇచ్చాయి. దీంతో టిడిపి..ఎన్డీయే లో చేరబోతుందని ప్రచారం మొదలైంది. అయితే మీటింగ్ కు సంబంధించి టిడిపికి సమాచారం లేదు..అసలు బిజేపితో ఎలాంటి రాజకీయ సంబంధాలు లేకుండా సమావేశానికి వెళ్ళే అవకాశం లేదు. కానీ జాతీయ మీడియా మాత్రం టిడిపి వెళుతుందని కథనాలు ఇచ్చింది.
దీని వెనుక పెద్ద రాజకీయ కోణం ఉందని తెలుస్తుంది. అవే జాతీయ మీడియా సంస్థలు వైసీపీకి కూడా అనుకూలంగా ఉన్నాయి. ఎలాగో ఏపీలో బిజేపికి బలం జీరో…నోటా ఓట్లు కూడా పార్టీ దాటలేదు. అలాగే ఏపీని సరిగ్గా పట్టించుకోలేదని ప్రజలకు బిజేపిపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పుడు బిజేపి…టిడిపితో కలుస్తుందని చెప్పడం వల్ల..బిజేపిపై ఉన్న యాంటీ టిడిపికి వెళుతుందని, అప్పుడు వైసీపీకి బెనిఫిట్ అవుతుందనే పాయింట్ తెస్తున్నారు.
అయితే ఎన్డీయే మీటింగ్కు సంబంధించి తమకు సమాచారం లేదని, అసలు ఎలాంటి చర్చలు లేకుండా మీటింగ్కు వెళ్ళే అవకాశంలేదని టిడిపి నేతలు తేల్చి చెప్పేశారు. కాబట్టి ఎన్డీయేలోకి టిడిపి వెళ్ళే అవకాశాలు కనిపించడం లేదు.