యువగళం పాదయాత్రతో నారా లోకేష్ దూసుకెళుతున్న విషయం తెలిసిందే. ప్రజలని కలుసుకుంటూ…వారి సమస్యలని తెలుసుకుంటూ..పరిష్కారానికి హామీలు ఇస్తూ..అధికారంలోకి వస్తే అన్నిటిని సరిచేస్తామని చెబుతూ ప్రజా మద్ధతు పెంచుకుంటూ వెళుతున్న లోకేష్..రాజకీయంగా టిడిపి బలం పెరిగేలా కూడా ముందుకెళుతున్నారు. ఇప్పటికే లోకేష్ పాదయాత్ర చేసిన జిల్లాలు అన్నీ గత ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటిన జిల్లాలే.
ముఖ్యంగా వైసీపీ స్వీప్ చేసిన జిల్లాలపై లోకేష్ ఫోకస్ ఎక్కువ పెట్టారు.గత ఎన్నికల్లో కర్నూలు, కడప, నెల్లూరు జిల్లాలతో పాటు విజయనగరం జిల్లాలో వైసీపీ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే కర్నూలు, కడప జిల్లాల్లో లోకేష్ పాదయాత్ర పూర్తి అయింది.ఇప్పుడు నెల్లూరు లో పాదయాత్ర కొనసాగుతుంది. ఇక ఈ జిల్లాల్లో టిడిపి బలం పెంచడమే లక్ష్యంగా లోకేష్ పాదయాత్ర కొనసాగింది. అయితే గత రెండు ఎన్నికల్లో ఈ మూడు జిల్లాల్లో వైసీపీదే హవా.
వైసీపీకి ఇలా మద్ధతు ఇచ్చిన సరే..ఆ మూడు జిల్లాలకు కొత్తగా ఒరిగింది ఏమి లేదు. జరిగిన అభివృద్ధి పెద్దగా లేదు. 2014లో టిడిపికి ఎక్కువ సీట్లు ఇవ్వకపోయినా..ఈ మూడు జిల్లాల్లో అభివృద్ధి బాగా చేశారు. అప్పుడే అభివృద్ధి బాగా చేశామని, వైసీపీకి అన్నీ సీట్లు ఇచ్చిన చేసిందేమి లేదని, కాబట్టి ఈ సారి టిడిపికి అన్నీ సీట్లు ఇవ్వాలని లోకేష్ అడుగుతున్నారు.
దీంతో ప్రజల ఆలోచనల్లో మార్పు వస్తుంది. అయితే లోకేష్ అడుగుతున్నట్లు టిడిపికి స్వీప్ రాదు గాని..సగం సీట్లు గెలుచుకున్న చాలు లోకేష్ ప్లాన్ సక్సెస్ అయినట్లే. ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో ఉమ్మడి కర్నూలులో 14 సీట్లు ఉంటే టిడిపి 7 సీట్లు గెలుచుకునే ఛాన్స్ ఉంది. కడపలో 10 సీట్లు ఉంటే 3 సీట్లు వరకు గెలుచుకోవచ్చు. నెల్లూరులో 10 సీట్లు ఉంటే 5 సీట్లు గెలుచుకునే ఛాన్స్ ఉంది. ఇలా గెలుచుకున్న చాలు లోకేష్ అనుకున్న ప్లాన్ సక్సెస్ అయినట్లే.