ఉమ్మడి గుంటూరు జిల్లాలో టిడిపికి పట్టు ఉంది..కానీ గుంటూరు నగరంలోని ఈస్ట్ స్థానంపై మొదట నుంచి పట్టు లేదు. ఇక్కడ గెలుపు కోసం తీవ్రంగానే పోరాడుతుంది. గత నాలుగు ఎన్నికల్లో వరుసగా ఓడిపోతూనే వస్తుంది. అలాగే ఇక్కడ టిడిపికి బలమైన అభ్యర్ధులు దొరకడం లేదు. అభ్యర్ధులు నిలకడ ఉండటం లేదు. ఎప్పుడో 1994, 1999 ఎన్నికల్లో ఇక్కడ గెలిచింది. మళ్ళీ ఇంతవరకు గెలవలేదు.
అయితే 2014లో గెలుపు ముందు వరకు వచ్చింది..అప్పుడు 3 వేల ఓట్ల తేడాతో ఓడింది. 2019 ఎన్నికల్లో 22 వేల ఓట్ల తేడాతో ఓడింది. ఎప్పటికప్పుడు అభ్యర్ధులని మార్చుకుంటూ వచ్చి ఫెయిల్ అవుతూ వస్తుంది. కానీ గత ఎన్నికల నుంచి టిడిపిలో నజీర్ ఉన్నారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయాక..అక్కడ యాక్టివ్ గానే పనిచేస్తున్నారు. కాకపోతే ఆయనకు సీటు విషయంలో ఇంకా గ్యారెంటీ లేదట. పైగా జనసేనతో పొత్తు ఉంటే ఏం జరుగుతుందో క్లారిటీ లేదు.
గత ఎన్నికల్లో ఇక్కడ జనసేనకు దాదాపు 22 వేల ఓట్లు పడ్డాయి. అంటే టిడిపి ఓడింది కూడా 22 వేల ఓట్ల మెజారిటీ. ఒకవేళ టిడిపి-జనసేన కలిస్తే గెలవడం సులువు. పైగా ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫాపై వ్యతిరేకత ఎక్కువగానే ఉంది. అటు అమరావతి ప్రభావం ఉంది. అంటే గుంటూరు ఈస్ట్ లో టిడిపి గెలవడానికి ఛాన్స్ ఉంది. కానీ అభ్యర్ధి విషయమే క్లారిటీ లేకపోవడం మైనస్.
పైగా జనసేనకు ఈ సీటు కేటాయిస్తారా? అనే డౌట్ ఉంది. అయితే టిడిపి-జనసేన పొత్తు ఉంటూ..బలమైన అభ్యర్ధిని బరిలో దింపితే గుంటూరు ఈస్ట్ సొంతం చేసుకోవచ్చు.