శ్రీకాళహస్తి…ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గం టిడిపి కంచుకోట.. రెడ్డి వర్గం హవా ఉన్న ఈ స్థానంలో టిడిపి 6 సార్లు గెలిచింది. 1983, 1985, 1989, 1994, 1999, 2014 ఎన్నికల్లో గెలిచింది. ఇందులో నాలుగుసార్లు బొజ్జల గోపాల కృష్ణారెడ్డి గెలిచారు. అయితే గత ఎన్నికల్లో బొజ్జల వారసుడు సుధీర్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. టిడిపి నుంచి బియ్యపు మధుసూదన్ రెడ్డి పోటీ చేసి గెలిచారు.
అయితే ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే బియ్యపుకు ప్రతికూల అంశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎమ్మెల్యేగా అనుకున్న మేర రాణించలేదు. పైగా పలు వివాదాలు..అలాగే ఇక్కడ అక్రమాలు ఎక్కువగా ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కాకపోతే రెడ్డి వర్గం ఎఫెక్ట్ వల్ల వైసీపీకి ఎడ్జ్ కనిపిస్తుంది. అదే సమయంలో ఇంచార్జ్ గా సుధీర్ మొదట్లో కాస్త యాక్టివ్ గా లేరు..తర్వాత నుంచి దూకుడుగా పనిచేస్తున్నారు. అయితే ఇంకా ఆయన బలం పెంచుకోవాలి.
ఇదే సమయంలో టిడిపిలోకి మాజీ ఎమ్మెల్యే ఎస్సివి నాయుడు చేరడం ప్లస్. ఆయనకు కాస్త బలం ఉంది. కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది. నాయుడు సైతం సీటు ఆశిస్తున్నారు. అటు సుధీర్ కూడా సీటుపై ఆశలు పెట్టుకున్నారు. కానీ పార్టీలో అంతర్గతంగా సర్వే చేసాకే చంద్రబాబు సీటు ఇచ్చే ఛాన్స్ ఉంది. అయితే బొజ్జల పార్టీకి ఎప్పటినుంచో సేవలు చేశారు. ఇక ఆయన ఇప్పుడు బ్రతికిలేరు. అయితే బొజ్జల ఫ్యామిలీకి న్యాయం చేయాలి కాబట్టి..సుధీర్ కే బాబు సీటు ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇక నాయుడు మద్ధతు తీసుకుంటే కాళహస్తిలో గెలుపు ఈజీ. అలా కాకుండా గ్రూపు రాజకీయాలు చేస్తే దెబ్బతింటారు.