తెలుగుదేశం పార్టీ గెలుపు దిశగా ముందుకెళుతున్న విషయం తెలిసిందే. పలు సర్వేలు సైతం టిడిపికి అనుకూలంగా ఉన్నాయి. టిడిపి నేతలూ ఇంకా కష్టపడితే టిడిపికి మంచి ఫలితం వస్తుంది. కానీ చంద్రబాబు, లోకేష్ కష్టపడుతుంటే..కింది స్థాయిలో కొందరు తమ్ముళ్ళు కుమ్ములాటలకు దిగుతున్నారు. గ్రూపులుగా విడిపోయి సీట్ల కోసం రచ్చ లేపుతున్నారు. ఇదే క్రమంలో టిడిపి కంచుకోటగా ఉన్న గోపాలపురంలో తమ్ముళ్ళు రచ్చ ఆపడం లేదు.
మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, ఇంచార్జ్ మద్దిపాటి వెంకటరాజు వర్గాలకు పడటం లేదు. వాస్తవానికి 2014లో టిడిపి నుంచి ముప్పిడి గెలిచారు. 2019లో ఓడిపోయారు. తర్వాత టిడిపిని బలోపేతం చేయడంలో వెనుకబడి ఉన్నారని, యువనేత మద్దిపాటికి ఛాన్స్ ఇచ్చారు. కానీ మద్దిపాటికి ముప్పిడి వర్గం సహకరించడం లేదు. యాంటీగా పనిచేస్తుంది. దీంతో చంద్రబాబు రెండు వర్గాలని పిలిచి క్లాస్ ఇచ్చారు. ముప్పిడికి సపోర్ట్ ఇస్తున్న సీనియర్ నేత ముళ్ళపూడి బాపిరాజుని పిలిచి క్లాస్ ఇచ్చారు.
అయితే బాపిరాజు ఏమో…నియోజకవర్గంలో ఎవరికి మద్ధతు ఎక్కువ ఉందో సర్వే చేసి ఆ నేతని అభ్యర్ధిగా పెడితే సపోర్ట్ చేస్తామని అంటున్నారు. ఇక అంతర్గత సర్వేల్లో మద్దిపాటికే ప్లస్ కనిపిస్తుందని తెలిసింది. కానీ మద్దిపాటికి ముళ్ళపూడి, ముప్పిడి సహకరించడం లేదు. తాజాగా నియోజకవర్గ ఇన్చార్జిని మార్పు చేయాలని పలువురు టిడిపి నేతలు సమావేశమై డిమాండ్ చేశారు. తమని సంప్రదించకుండా ఇంచార్జ్ని పెట్టడం కరెక్ట్ కాదని అంటున్నారు.
ఇక వీరంతా ముప్పిడి వర్గం వాళ్ళే అని మద్దిపాటి వర్గం అంటుంది. అయితే ముప్పిడి వెంకటేశ్వరరావు, మద్దిపాటి వెంకట రాజు కాకుండా మూడోవ్యక్తిని నియమించినా పని చేస్తామని కొందరు నేతలు చెబుతున్నారు. ఇలా గోపాలపురం తమ్ముళ్ళు పోరు సాగిస్తున్నారు. ఈ పోరుకు త్వరగా చెక్ పెట్టి..అభ్యర్ధిని ఫిక్స్ చేసి..అంతా కలిసి పనిచేస్తేనే గోపాలపురంలో గెలిచేది..లేదంటే మళ్ళీ వైసీపీ వశం అవుతుంది.