మరొకసారి ఏపీలో పొత్తులపై చర్చ మొదలైంది..తాజాగా ఎన్డీయే సమావేశానికి ఢిల్లీకి వెళ్ళిన జనసేన అధినేత పవన్ కల్యాణ్..వచ్చే ఎన్నికల్లో టిడిపి-జనసేన-బిజేపి కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రకటన చేశారు. అరాచక పాలన చేస్తున్న జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే మూడు పార్టీలు కలవాలని చెప్పుకొచ్చారు. ఇక బిజేపి-జనసేన కలిసే ఉన్నాయని, ఇంకా తమతో కలవాలా? లేదా? అనేది టిడిపి తేల్చుకోవాలని అన్నారు.
అలాగే ఎన్నికల్లో గెలిచాక అప్పుడు బలం బట్టి సిఎం అభ్యర్ధిపై నిర్ణయం ఉంటుందని..తనకు సిఎం సీటు ముఖ్యం కాదని, వైసీపీని గద్దె దించడమే ప్రధానమని చెప్పుకొచ్చారు. దీంతో పొత్తు అంశం ఇప్పుడు చంద్రబాబు కోర్టులోకి వచ్చింది. పొత్తులపై ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. అయితే గతంలో పవన్, బాబు మూడుసార్లు భేటీ అయ్యారు. కానీ పొత్తులపై చర్చ జరగలేదని అన్నారు. తర్వాత నుంచి ఎవరికి వారే సొంతంగా రాజకీయం చేసుకుంటున్నారు.
అయితే రాష్ట్రంలో బిజేపికి బలం ఒక శాతమే..పైగా రాష్ట్రానికి న్యాయం చేయలేదని ప్రజలు బిజేపిపై కోపంతో ఉన్నారు. ఈ సమయంలో బిజేపితో కలితే టిడిపికే నెగిటివ్ అనే టిడిపి శ్రేణులు అంటున్నాయి. అయినా బిజేపి బలం ఒక శాతం..జనసేనకు 10 శాతం లోపు ఉంది. 40 శాతం వరకు బలం ఉన్న టిడిపికి పవన్ ఆప్షన్స్ ఇవ్వడం కాస్త ఇబ్బందిగానే ఉంది.
పైగా పొత్తు ఉంటే టిడిపికే ఎక్కువ సీట్లు లభిస్తాయి..అలాగే చంద్రబాబు ఉండగా…సిఎం అనే చర్చ లేదు. కానీ పవన్ అవన్నీ చర్చకు తేవడంపై టిడిపి శ్రేణులు ఒంటరిగా బరిలో దిగడమే బెటర్ అంటున్నారు. అయితే పొత్తులపై బాబు ఆలోచన ఎలా ఉంది..ఆయన ఏ నిర్ణయం తీసుకున్న కట్టుబడి ఉంటామని అంటున్నారు. చూడాలి మరి పొత్తులపై బాబు ఎలా ముందుకెళ్తారో.