లోకేష్ పాదయాత్రకు ప్రజా మద్ధతు రోజురోజుకూ పెరుగుతుంది. ఊహించని విధంగా ప్రజల నుంచి స్పందన వస్తుంది. లోకేష్ ప్రజలతో మమేకమవుతున్న తీరు…వారి సమస్యలపై మాట్లాడుతున్న తీరు..జగన్ ప్రభుత్వం, వైసీపీ ఎమ్మెల్యేల అక్రమాలపై ఆధారాలతో సహ వివరించడం..టిడిపి గెలిస్తే ప్రజలకు ఏం చేస్తుందో చెప్పడం..అన్నీ వర్గాల ప్రజలతో ప్రత్యేక సమావేశాలు పెట్టడం..ఇవన్నీ ఆకట్టుకుంటున్నాయి. అన్నిటికంటే ఆయన స్పీచ్లు చాలా మెరుగయ్యాయి.
ఇలా ఎప్పటికప్పుడు లోకేష్ సత్తా చాటుతూనే ఉన్నారు. అలాగే పార్టీ బలం పెంచుతూనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన పాదయాత్ర ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొనసాగుతుంది. తాజాగా కొండపిలో పాదయాత్ర సాగింది. అక్కడ భారీ ఎత్తున ప్రజలు కూడా వచ్చారు. అలాగే సభకు వూహించని విధంగా జనం వచ్చారు. అసలు ఆ స్థాయిలో జనం వస్తారని టిడిపి శ్రేణులే ఊహించలేదు.మొత్తానికి పెద్ద ఎత్తున జనం రావడంతో కొండపి టిడిపిలో జోష్ నెలకొంది. ఇంకా అక్కడ హ్యాట్రిక్ విజయానికి టిడిపి చేరువైంది. మామూలుగా కొండపి టిడిపికి అంత పట్టు ఉన్న స్థానం కాదు. గతంలో ఇక్కడ మూడుసార్లు గెలిచింది. 1983, 1994,1999 ఎన్నికల్లో గెలిచింది. తర్వాత వరుసగా ఓడిపోయింది.
కానీ 2014 ఎన్నికల్లో టిడిపి మళ్ళీ విజయం సాధించింది. టిడిపి నుంచి స్వామి గెలిచారు. ఆయన నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటపట్టించారు. అందుకే 2019 ఎన్నికల్లో జగన్ గాలిలో కూడా గెలిచేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రజలతోనే ఉంటూ, వారి సమస్యలపై పోరాటం చేస్తున్నారు. అటు వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయి. ఈ పరిణామాలు టిడిపికి ప్లస్. ఇప్పుడు లోకేష్ పాదయాత్ర మరింత ప్లస్ అయింది. అక్కడ టిడిపి బలం పెరిగి..హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధమైంది.