రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా ఆధిక్యంలోకి వస్తుంది. ఇప్పటివరకు అధికార బలంతో వైసీపీ హవా కనిపించిన ఇప్పుడు టిడిపి లీడ్ లోకి వస్తుంది. టిడిపి ఏళ్ల తరబడి ఓడిపోతున్న స్థానాల్లో కూడా పట్టు సాధిస్తుంది. ఈ క్రమంలోనే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో టిడిపి ఆధిక్యం దిశగా వెళుతుంది. ఇప్పటికే అక్కడ వైసీపీలో ఆధిపత్య పోరు తీవ్ర స్థాయిలో ఉంది. తాజాగా రామచంద్రాపురంలో మంత్రి వేణుగోపాల్, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ల మధ్య పోరు నడుస్తుంది. సీటు కోసం సుభాష్ గట్టిగానే ట్రై చేస్తున్నారు.
ఈ పంచాయితీ జగన్ దగ్గరకు కూడా వెళ్లింది..అయినా బోస్ తగ్గేలా లేరు. ఇదిలా నడుస్తుండగానే జగ్గంపేటలో రచ్చ మొదలైంది. అక్కడ వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఇప్పటికే ప్రజా వ్యతిరేకతని ఎదురుకుంటున్నారు. ఈ క్రమంలోనే మాజీ ఎంపీ తోట నరసింహం రంగంలోకి దిగారు. ఈ సీటుని తన తనయుడుకు దక్కించుకోవాలని చూస్తున్నారు.
అయితే గతంలో తోట 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున జగ్గంపేటలో గెలిచారు. 2014లో టిడిపి నుంచి కాకినాడ ఎంపీగా గెలిచారు. నెక్స్ట్ వైసీపీలోకి వచ్చారు. 2019లో తోట భార్య వాణి..పెద్దాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.తర్వాత కొన్ని రోజులు రాజకీయాలకు దూరమై..ఇప్పుడు తన తనయుడు రాంజీ కోసం జగ్గంపేట సీటు ట్రై చేస్తున్నారు.
ఇలా వైసీపీలో రచ్చ నడవటం టిడిపికి కలిసొస్తుంది. అక్కడ టిడిపి నుంచి జ్యోతుల నెహ్రూ ఉన్నారు. ఈ సారి గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. అయితే ఇక్కడ టిడిపి చివరిగా గెలిచింది 1999 ఎన్నికల్లో ఇంకా వరుసగా ఓడిపోతూ వస్తుంది. మళ్ళీ ఇన్నేళ్లకు అక్కడ టిడిపికి గెలిచే ఛాన్స్ పుష్కలంగా ఉంది.