కోనసీమలో టిడిపి అధినేత చంద్రబాబు భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. అటు మండపేట, ఇటు కొత్తపేట బాబు యాత్రకు ప్రజా మద్ధతు పెద్ద ఎత్తున వస్తుంది. జై బాబు, జై జై బాబు అంటూ కోనసీమ దద్దరిల్లింది. అడుగడుగునా చంద్రబాబుకు నీరాజనం పలికారు. చంద్రబాబుకు కొత్తపేటలోని గుమ్మిలేరు, కొత్తూరు సెంటరు, ఆలమూరులో ప్రజలు ఘన స్వాగతం పలికారు. దారిపొడవునా క్రేన్లతో దండలు వేశారు. మహిళలు హారతులు పట్టారు. పూలవర్షం కురిపించారు.
మధ్యలో చంద్రబాబు..కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అక్రమ ఇసుక నిల్వల వద్ద సెల్ఫీ దిగి..ఇది వైసీపీ ఎమ్మెల్యే నిర్వాకం అని చాటిచెప్పారు. ఇక భారీ ర్యాలీతో వస్తూ రావులపాలెం వైపు వస్తున్న ఆర్టీసీ బస్సులో టిక్కెట్టు తీసుకుని ప్రయాణించారు. ఆర్టీసీలో మహిలలతో కాసేపు బాబు ముచ్చటించారు. వారి బాధలు తెలుసుకున్నారు. మహిళలు పెరుగుతున నిత్యావసర ధరలు, వంట గ్యాస్ ధరలపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బాబు..వారికి కీలక హామీలు ఇచ్చారు. ఇటీవల మినీ మేనిఫెస్టోలోని మహాశక్తి కార్యక్రమాలని వివరించారు.
ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం..జిల్లా పరిధిలో మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం..18-59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1500, తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీలు మహిళలని బాగా ఆకట్టుకున్నాయి.
ఇక రావులపాలెం సెంటర్ లో బాబు భారీ బహిరంగ సభ జరిగింది. అక్కడ రోడ్లు అన్నీ కిక్కిరిసిపోయాయి. ఊహించని విధంగా టిడిపి శ్రేణులు, ప్రజలు వచ్చారు. ఇలా కోనసీమలో బాబుకు ప్రజా మద్ధతు ఊహించని విధంగా దక్కింది.