మార్గదర్శి..60 ఏళ్ల నుంచి పేద, మధ్యతరగతి ప్రజల కలల సాకారం చేసే చిట్ఫండ్ సంస్థ..ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు ఏర్పాటు చేసిన ఈ సంస్థ 60 ఏళ్ల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో విజయవంతంగా నడుస్తోంది. గతంలో ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చాయి. కానీ ఏనాడూ మార్గదర్శిని రాజకీయంగా టార్గెట్ చేయలేదు. అయితే ఏపీలో జగన్ ప్రభుత్వం పూర్తిగా మార్గదర్శిపై కక్షపూరిత చర్యలకు పాల్పడుతుందనే వాస్తవం అందరికీ అర్ధమవుతుందని ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు.
అయితే వైసీపీ ప్రభుత్వ అక్రమాలు, దౌర్జన్య కాండ, అవినీతిని ఈనాడు సంస్థ ఎప్పటికప్పుడు వెలుగులో పెట్టడంతో..రామోజీరావుని టార్గెట్ చేసుకుని జగన్ ప్రభుత్వం ఆడుతున్న గేమ్ టార్గెట్ మార్గదర్శి అని రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు. మార్గదర్శిలో అక్రమాలు జరిగినట్లు అందులో ఉండే ఏ ఖాతాదారుడు ఫిర్యాదు చేయలేదు. కానీ వైసీపీ ప్రభుత్వం సిఐడిని ప్రయోగించి..మార్గదర్శిలో అక్రమాలు జరుగుతున్నాయని దాడులు చేయడం, ఆ సంస్థని పూర్తి గా దెబ్బతీసే దిశగా పనిచేస్తుందనే ఆరోపణలు ఉన్నాయి.
అయితే ఇంతవరకు అందులో ఎలాంటి అక్రమాలు జరిగాయో తేల్చలేదు. అదే సమయంలో కోర్టులు సైతం మార్గదర్శిపై చర్యలు తీసుకోవడానికి వీలు లేదని స్టే ఇచ్చిన..వాటిని భేఖాతరు చేస్తూ..ఏపీ ప్రభుత్వం మార్గదర్శి టార్గెట్ గానే దాడులు సాగిస్తుందని అంటున్నారు. ఇక చిట్స్ లో ఎలాంటి అక్రమాలు తేలకపోవడంతో ఇప్పుడు..వివిధ శాఖల ద్వారా..తాజాగా ఏపీలోని పలు మార్గదర్శి సంస్థలపై దాడులు నిర్వహించారు.
సీఐడీ, అగ్నిమాపక, రిజిస్ర్టేషన్లు, స్టాంపులు, రెవెన్యూ, ఇంటెలిజెన్స్, మున్సిపల్ ఇలా 11 విభాగాల అధికారులను రంగంలోకి దించింది. పలుచోట్ల సిబ్బందిని సైతం బయటికి పంపి, తలుపులు మూసి రికార్డులు, మినిట్స్ పుస్తకాలను అధికారులు తనిఖీ చేశారు. భవనాలకు తగిన అనుమతులు తీసుకున్నారా? లేదా? అగ్నిప్రమాదాల నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? వాటిని రెన్యువల్ చేశారా? తదితర వివరాలనూ ఆరా తీశారు.
ఆఖరికి మార్గదర్శికి భవనాలు అద్దెకు ఇచ్చిన ఓనర్లని వదిలిపెట్టడం లేదు..ఆ బిల్డింగులకు పర్మిషన్, కరెంట్ బిల్లులు, ఒప్పంద పత్రాలు..ఇలా రకరకాల కోణాల్లో విచారణ చేస్తున్నారు. టోటల్ గా మార్గదర్శిని మూయించే దిశగా ఏపీ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు ఉందని విమర్శలు వస్తున్నాయి.
అయితే ఇలా చేసుకుంటూ వెళితే రాజకీయ కక్ష తప్పితే మరొకటి కనబడదు. ఇంకా గట్టిగా అయితే 6 నెలలు అని, ఆ తర్వాత పరిస్తితి మారుతుందని, అది కూడా జరగకపోతే..తెలంగాణ నుంచే మార్గదర్శి నడుస్తుందని, అప్పుడు ఏపీకి వచ్చే ఆదాయం రాదని అంటున్నారు. కాబట్టి టార్గెట్ మార్గదర్శి వల్ల పరోక్షంగా వైసీపీకే నష్టమని చెబుతున్నారు.