మళ్ళీ తెలంగాణ సిఎం కేసిఆర్..ఏపీలో జగన్కు సపోర్ట్ ఇవ్వాలని చూస్తున్నారా? మరొకసారి జగన్ని అధికారంలోకి తీసుకురావాలని భావిస్తున్నారా? చంద్రబాబుకు చెక్ పెట్టాలని చూస్తున్నారా? అంటే తాజాగా జరిగిన పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తున్నాయి. ఏపీలో కేసిఆర్ బిఆర్ఎస్ పార్టీని పెట్టారు. కానీ ఆ పార్టీకి ఏ మాత్రం పట్టు లేదు. దీంతో ఏం చేయలేరు. కాబట్టి ఈ సారి కూడా జగన్కు అవకాశం వచ్చేలా చేస్తే..తర్వాత టిడిపిని కనుమరుగు చేసి..మళ్ళీ ఆ పార్టీ ప్లేస్ని తీసుకుని కేసిఆర్ చూస్తున్నట్లు తెలుస్తుంది.
ఎలాగో తెలంగాణలో టిడిపిని కేసిఆర్ పూర్తిగా దెబ్బతీశారు. అందుకే బిఆర్ఎస్ పార్టీ బలం పెంచుకున్నారు. అయితే 2018 తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు, కాంగ్రెస్ కలిసి పనిచేశాయి. దీంతో ఆ ఎన్నికల్లో మళ్ళీ గెలిచి అధికారంలోకి వచ్చిన కేసిఆర్..బాబుకు ఏపీలో చెక్ పెట్టాలని చెప్పి అక్కడ రాజకీయం నడిపించారు. తెలంగాణ నేతలు బాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. 2019 ఎన్నికల్లో జగన్కు కేసిఆర్ ఆర్ధిక సాయం కూడా చేశారనే ప్రచారం కూడా ఉంది. సరే ఏదైతే ఏముంది. ఏపీలో బాబు ఓడిపోయారు..జగన్ గెలిచారు.
జగన్ ఏపీలో వచ్చాకే తెలంగాణ ఇంకా బాగుపడింది. ఏపీకి కంపెనీలు రాలేదు..హైదరాబాద్ ఇంకా అంతర్జాతీయ స్థాయిలో డెవలప్ అయింది. రియల్ ఎస్టేట్ పెరిగింది. ఏపీలో జగన్ ఉంటేనే తెలంగాణలో తమకు లాభం అనే విధంగా కేసిఆర్ ఉన్నారు. అదే చంద్రబాబు ఉంటే పరిస్తితులు వేరుగా ఉంటాయి. అందుకే మళ్ళీ ఏపీలో జగన్ నే అధికారంలోకి తీసుకురావడానికి కేసిఆర్ కృషి చేస్తున్నారని తెలిసింది.
ఎలాగ బాబు-పవన్ కలుస్తున్నారు..దీంతో వారికి గెలిచే అవకాశాలు ఉన్నాయి..పవన్ వల్ల కాపుల ఓట్లు వన్ సైడ్ అవుతాయి. అలా కాకుండా కాపుల ఓట్లు చీల్చేలా కేసిఆర్ ప్లాన్ చేసి..జగన్ కు మేలు చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలో కొందరు కాపు మాజీ అధికారులతో సమావేశమై..ఎలాగైనా ముందు టిడిపి-జనసేన పొత్తు చెడగొట్టేలా ప్లాన్ చేశారట..అది కుదరని పక్షంలో కాపుల ఓట్లలో చీలిక తీసుకురావాలని చూస్తున్నారట. దీని ద్వారా బాబు-పవన్ కు చెక్ పెట్టవచ్చు. జగన్ కు మేలు చేయవచ్చు. ఇదే కేసిఆర్ ప్లాన్. మరి ఈ సారి కేసిఆర్ ప్లాన్ ఏ మేర వర్కౌట్ అవుతుందో చూడాలి