ఆర్కే రోజా పరిచయమే అక్కర్లేని పేరు. చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం నుండి 2014 ,2019లో ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. మంత్రివర్గ విస్తరణలో భాగంగా మంత్రి పదవిని కూడా అందుకున్నారు. టిడిపి నుంచి వైసీపీ లోకి మారిన తర్వాత రోజా 2014లో నగరి నియోజక వర్గం నుంచి టిడిపి సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు పై స్వల్ప మెజారిటీతో గెలుపొంది, అసెంబ్లీలో అడుగుపెట్టిన రోజా అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు పై అసెంబ్లీలో జరిగిన సంఘటన కారణంగా ఒక సంవత్సరం పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయినది. 2019 ఎన్నికలలో గాలి భాను ప్రకాష్ పై విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టారు.
చంద్రబాబు,లోకేష్ ,పవన్ కళ్యాణ్ పై విమర్శనాస్త్రాలను సంధిస్తూ ఉండేవారిలో రోజా కూడా ఒక ముఖ్యమైనది చెప్పవచ్చు. టిడిపి అధినేతను, జనసేన అధినేతను విమర్శించడానికి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఏ చిన్న అవకాశం దొరికిన వదలకుండా విమర్శిస్తుంటారు. అదే విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న చంద్రబాబు రాష్ట్రంలోని కొన్ని ముఖ్య నియోజకవర్గాలతో పాటు నగరిపై కూడా తన ప్రత్యేక దృష్టిని సారించారు. రోజాపై పోటీగా నిలబెట్టడానికి సినీ ప్రముఖులకు పేర్లు ప్రస్తావనకు వచ్చిన ఎప్పటినుండో పార్టీని నమ్ముకొని ఉన్న గాలి కుటుంబానికి మళ్లీ పార్టీ టికెట్ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. జనసేన కార్యకర్తలు కూడా ఈసారి కచ్చితంగా నగరిలో రోజాను ఓడించి తీరుతామని చెబుతున్నారు.
రోజా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని అందరి అభిప్రాయం. నియోజకవర్గ అభివృద్ధికి కూడా రోజా ఏమీ చేయలేదని వాదన వినిపిస్తోంది. రోజా తీరుపై సొంత పార్టీ నేతలలోనే అసంతృప్తి ఉన్నదని స్వయంగా రోజా అని చెప్పి చాలా సార్లు బాధపడింది. గడపగడపకు మన ప్రభుత్వంలో కూడా రోజా చురుకుగా లేదనే విషయం జగన్ దృష్టిలో ఉంది. గత ఎన్నికలలోనే స్వల్ప మెజారిటీతో గెలిచిన రోజా ఈ పరిస్థితులలో గెలవాలంటే ఏదైనా అద్భుతం జరగాల్సిందే అని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
సొంత పార్టీలో అసమ్మతి, రోజాపై ప్రజలలో ఉన్న వ్యతిరేకత, అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకత, గాలి భాను ప్రకాష్ కు ప్రజలలో సానుభూతి ఇవన్నీ చూస్తే ఈసారి రోజా నగరిలో గెలవడం కష్టమే అనే విషయం సామాన్య ప్రజలకు సైతం అర్థమవుతుంది.