వచ్చే ఎన్నికల్లో టిడిపి ఎవరితో పొత్తు పెట్టుకుంటుంది..జనసేనతో కలుస్తుందా? లేక జనసేన-బిజేపిలతో కలుస్తుందా? అసలు పొత్తు లేకుండా ఒంటరిగా బరిలో దిగుతుందా? అంటే వీటికి సమాధానం తెలియాలంటే ఎన్నికల సమయం వరకు ఆగాల్సిందే అని టిడిపి కార్యకర్తలు అంటున్నారు. అప్పుడు చంద్రబాబు పొత్తులపై నిర్ణయం తీసుకుంటారని, అప్పటివరకు టిడిపి బలోపేతమే లక్ష్యమని చెబుతున్నారు.
తాజాగా టిడిపి-బిజేపి-జనసేన కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని పవన్ చెప్పడంపై టిడిపిలో చర్చ నడుస్తుంది. జనసేనతో అంటే ఓకే గాని..బిజేపితో పొత్తు టిడిపికే నష్టమని అంటున్నారు. అలాగే బిజేపి ఏదో స్కెచ్ వేసి టిడిపిని దెబ్బతీయడానికే ఈ పొత్తు అని అనుమానిస్తున్నారు. అదే సమయంలో ఎన్నికల తర్వాత సిఎం సీటు గురించి మాట్లాడకుంటామని పవన్ చెప్పడంపై టిడిపి శ్రేణులు అభ్యంతరం చెబుతున్నారు. అదే జరిగే పని కాదని అంటున్నారు. అయితే నూటికి 90 శాతం టిడిపి కార్యకర్తలు బిజేపితో పొత్తు వద్దనే అంటున్నారు.
జనసేన కలిసి వస్తే ఓకే..అలా కాకుండా జనసేన-బిజేపితో పొత్తు వద్దని సోషల్ మీడియా వేదికగా చెప్పేస్తున్నారు. ఈ క్రమంలో టిడిపి అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం..పొత్తుపై చంద్రబాబు ఇప్పుడేమీ నిర్ణయం తీసుకోలేదని, ముందు ఓటర్ల లిస్టు, పార్టీ బలోపేతం, మినీ మేనిఫెస్టో ప్రజల్లోకి తీసుకెళ్ళడం, లోకేశ్ పాదయాత్ర ఈ అంశాలే టిడిపికి ప్రధానమని అంటున్నారు.
అయితే గతంలో బాబు-పవన్ మూడుసార్లు కలిశారని..జనసేనతో కలిసి వైసీపీ అరాచకాలపై టిడిపి పోరాడుతుందని, ఇప్పుడు అదే స్టాండ్ పై ఉన్నామని, అలాగే గత ఎన్నికల తర్వాత నుంచి సిపిఐని ప్రతి అంశంలో కలుపుకుని వెళుతున్నామని, ఆ పార్టీని కలుపుకుని ప్రజా సమస్యలపై టిడిపి పోరాటం చేసిందని, ఇప్పుడు అదే స్టాండ్ పై ఉందని చెబుతున్నారు. ఇక మిగిలిన అంశాలు ఎన్నికల ముందే బాబు తేలుస్తారని అంటున్నారు. మొత్తానికి ఇప్పుడైతే టిడిపిలో పొత్తుల గురించి చర్చ లేదు.
వచ్చే ఎన్నికల్లో టిడిపి ఎవరితో పొత్తు పెట్టుకుంటుంది..జనసేనతో కలుస్తుందా? లేక జనసేన-బిజేపిలతో కలుస్తుందా? అసలు పొత్తు లేకుండా ఒంటరిగా బరిలో దిగుతుందా? అంటే వీటికి సమాధానం తెలియాలంటే ఎన్నికల సమయం వరకు ఆగాల్సిందే అని టిడిపి కార్యకర్తలు అంటున్నారు. అప్పుడు చంద్రబాబు పొత్తులపై నిర్ణయం తీసుకుంటారని, అప్పటివరకు టిడిపి బలోపేతమే లక్ష్యమని చెబుతున్నారు.
తాజాగా టిడిపి-బిజేపి-జనసేన కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని పవన్ చెప్పడంపై టిడిపిలో చర్చ నడుస్తుంది. జనసేనతో అంటే ఓకే గాని..బిజేపితో పొత్తు టిడిపికే నష్టమని అంటున్నారు. అలాగే బిజేపి ఏదో స్కెచ్ వేసి టిడిపిని దెబ్బతీయడానికే ఈ పొత్తు అని అనుమానిస్తున్నారు. అదే సమయంలో ఎన్నికల తర్వాత సిఎం సీటు గురించి మాట్లాడకుంటామని పవన్ చెప్పడంపై టిడిపి శ్రేణులు అభ్యంతరం చెబుతున్నారు. అదే జరిగే పని కాదని అంటున్నారు. అయితే నూటికి 90 శాతం టిడిపి కార్యకర్తలు బిజేపితో పొత్తు వద్దనే అంటున్నారు.
జనసేన కలిసి వస్తే ఓకే..అలా కాకుండా జనసేన-బిజేపితో పొత్తు వద్దని సోషల్ మీడియా వేదికగా చెప్పేస్తున్నారు. ఈ క్రమంలో టిడిపి అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం..పొత్తుపై చంద్రబాబు ఇప్పుడేమీ నిర్ణయం తీసుకోలేదని, ముందు ఓటర్ల లిస్టు, పార్టీ బలోపేతం, మినీ మేనిఫెస్టో ప్రజల్లోకి తీసుకెళ్ళడం, లోకేశ్ పాదయాత్ర ఈ అంశాలే టిడిపికి ప్రధానమని అంటున్నారు.
అయితే గతంలో బాబు-పవన్ మూడుసార్లు కలిశారని..జనసేనతో కలిసి వైసీపీ అరాచకాలపై టిడిపి పోరాడుతుందని, ఇప్పుడు అదే స్టాండ్ పై ఉన్నామని, అలాగే గత ఎన్నికల తర్వాత నుంచి సిపిఐని ప్రతి అంశంలో కలుపుకుని వెళుతున్నామని, ఆ పార్టీని కలుపుకుని ప్రజా సమస్యలపై టిడిపి పోరాటం చేసిందని, ఇప్పుడు అదే స్టాండ్ పై ఉందని చెబుతున్నారు. ఇక మిగిలిన అంశాలు ఎన్నికల ముందే బాబు తేలుస్తారని అంటున్నారు. మొత్తానికి ఇప్పుడైతే టిడిపిలో పొత్తుల గురించి చర్చ లేదు.