పాదయాత్రతో లోకేష్ దూసుకెళుతున్నారు. ఊహించని విధంగా ప్రజా మద్ధతు వస్తుంది. రోజురోజుకూ లోకేష్ కు ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది. తాజాగా కొండపి నియోజకవర్గం సభకు భారీ స్థాయిలో జనం వచ్చారని అనుకుంటే..అంతకుమించి కనిగిరిలో వచ్చారు. జోరు వానలో కూడా లోకేష్ కోసం నిలబడ్డారు. ఈ పరిణామాలు టిడిపి వైపు ప్రజలు చూస్తున్నారని తెలుపుతున్నాయి. ఇక కనిగిరిలో సాధారణంగా టిడిపికి బలం తక్కువే.
మొదట నుంచి అక్కడ అనుకున్న బలం ఏమి లేదు. రెడ్డి, బీసీ వర్గాలు ఎక్కువ ఉన్న ఈ స్థానంలో మొదట నుంచి కాంగ్రెస్ సత్తా చాటుతుంది. ఇక 1983, 1985 ఎన్నికల్లో టిడిపి గెలిచింది. మళ్ళీ 1989లో కాంగ్రెస్ 1994లో టిడిపి గెలిచాయి. 1999, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. 2014లో టిడిపి విజయం సాధించింది. ఇక 2019లో వైసీపీ గెలిచింది. అయితే ఇప్పుడు అక్కడ వైసీపీ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉంది. దీంతో టిడిపి అనూహ్యంగా బలపడింది. టిడిపి ఇంచార్జ్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి..దూకుడుగా పనిచేస్తున్నారు.
ఇదే సమయంలో నారా లోకేష్ పాదయాత్ర కనిగిరిలో టిడిపికి కొత్త ఊపు తెచ్చింది. ఈ సారి ఎన్నికల్లో అక్కడ టిడిపి గెలుపు ఖాయమనే పరిస్తితి. అటు వైసీపీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ని మారుస్తారనే టాక్ ఉంది. ఆయనపై అనేక ఆరోపణలు వచ్చాయి. సొంత పార్టీ వాళ్ళే ఆయనకు యాంటీగా ఉన్నారు. అదే సమయంలో ఈ సీటుపై మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు ఫోకస్ పెట్టారు.
ఈయన 2014లో టిడిపి నుంచి గెలిచారు..2019లో దర్శిలో ఓడిపోయి..నెక్స్ట్ వైసీపీలోకి వెళ్లారు. నెక్స్ట్ ఎన్నికల్లో కనిగిరి సీటు దక్కించుకోవాలని చూస్తున్నారు. ఈ పోరు వైసీపీకి నష్టమే చేసేలా ఉంది. మొత్తానికి ఈ సారి కనిగిరిలో సైకిల్ హవా నడిచేలా ఉంది.
ReplyReply allForward |