తెలుగుదేశం పార్టీకి ఎక్కడైతే సరైన అభ్యర్ధులు లేరో..ఆ స్థానాలపై చంద్రబాబ్ ఫోకస్ చేసి..బలమైన అభ్యర్ధులని ఫిక్స్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే పలు స్థానాల్లో కొత్త అభ్యర్ధులని రంగంలోకి దింపారు. ఈ క్రమంలోనే రాజానగరంలో టిడిపి ఇంచార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరీని నియమించారు. ఈయన దివంగత బొడ్డు భాస్కర రామారావు తనయుడు. గతంలో బొడ్డు..పెద్దాపురం నుంచి పలుమార్లు టిడిపి ఎమ్మెల్యేగా గెలిచారు.
అయితే తర్వాత పెద్దాపురంలో నిమ్మకాయల చినరాజప్ప హవా మొదలైంది. దీంతో బొడ్డు సైడ్ అయ్యారు. నెక్స్ట్ వైసీపీలోకి వెళ్లారు. 2104 ఎన్నికల్లో బొడ్డు తనయుడు వెంకటరమణ వైసీపీ నుంచి రాజమండ్రి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక తర్వాత టిడిపిలోకి వచ్చేశారు. ఇక 2019 ఎన్నికల్లో పెద్దాపురం సీటు మళ్ళీ రాజప్పకి దక్కింది. ఆయన గెలిచారు. తర్వాత బొడ్డు అనారోగ్యంతో మరణించారు. ఇక ఆయన తనయుడు పెద్దాపురం సీటుపై ఫోకస్ పెట్టే పనిచేస్తున్నారు.
దీంతో రాజప్పతో విభేదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో వెంకటరమణని రాజానగరం ఇంచార్జ్ గా పెట్టారు. దీంతో పోరు ఆగింది. అయితే రాజానగరంలో టిడిపి మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ ఉన్నారు. 2009, 2014లో గెలిచిన ఆయన..2019లో ఓడిపోయారు. కానీ తర్వాత టిడిపిని బలోపేతం చేయడం లేదని చంద్రబాబు క్లాస్ ఇచ్చారు. దీంతో ఆయన ఇంచార్జ్ పదవికి రాజీనామా చేశారు.
అయితే వెంకటేష్ని కూడా పిలిపించుకుని మాట్లాడి..వెంకటరమణని ఇంచార్జ్ గా పెడుతున్నామని చెప్పి..నెక్స్ట్ రాజకీయంగా న్యాయం చేస్తామని బాబు..వెంకటేష్కు హామీ ఇచ్చారు. దీంతో సమస్యలు ఆగాయి. ఇక ఇటీవలే రాజానగరంలో జనసేన ఇంచార్జ్ని కూడా పెట్టారు. అటు వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఉన్నారు. ఈ సారి పొత్తు లేకపోతే ప్రధానంగా టిడిపి-వైసీపీల మధ్య పోటీ ఉంటుంది..పొత్తు ఉంటే టిడిపి-జనసేనల్లో సీటు ఎవరికి దక్కుతుందో క్లారిటీ లేదు. పొత్తు ఉంటే వైసీపీకి ఓటమే.