పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం..ఇక్కడ రాజకీయం ఎప్పుడు హాట్ గానే ఉంటుంది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయం మరింత వేడెక్కింది. ఈ సారి మళ్ళీ గెలవాలని అటు ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, ఈ సారి ఎలాగైనా గెలవాలని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు చూస్తున్నారు. యరపతినేని అంతకముందు 2009, 2014 ఎన్నికల్లో గెలిచారు. కానీ 2019లో నరసారావుపేటకు చెందిన కాసు మహేష్ రెడ్డిని..గురజాల బరిలో నిలబెట్టారు.
ఇక వైసీపీ గాలిలో కాసు గెలిచారు. యరపతినేని ఓడిపోయారు. 28 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. గెలిచాక అధికార బలంతో కాసు దూసుకెళుతున్నారు. కానీ అధికారం బలమే ఉంది గాని నిదానంగా ప్రజా బలం తగ్గింది. అక్కడ కాసు వర్గం అక్రమాలు ఎక్కువయ్యాయని టిడిపి ఆరోపణలు చేస్తుంది. అలాగే అభివృధ్ది చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. అదే సమయంలో అక్కడే ఉన్న సీనియర్ వైసీపీ నేత, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి వర్గంతో కాసుకు పడటం లేదు. వాస్తవానికి గురజాల జంగా సొంత స్థానం గతంలో కాంగ్రెస్ నుంచి రెండుసార్లు గెలిచారు.
2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో జగన్ చెప్పడం వల్ల కాసుకు సీటు త్యాగం చేసి ఆయన గెలుపు కోసం పనిచేశారు. కానీ గెలిచాక కాసు మహేష్..జంగా వర్గాన్ని సైడ్ చేశారు. దీంతో జంగా వర్గం యాంటీ అయింది. ఈ సారి సీటు ఇస్తే మహేష్కు సహకరించడం కష్టమే. అదే యరపతినేనికి పెద్ద ప్లస్.
అదే సమయంలో ఇక్కడ జనసేన ప్రభావం కాస్త ఉంది. గత ఎన్నికల్లో 12 వేల ఓట్లు తెచ్చుకుంది..ఇప్పుడు 20 వేల ఓట్ల వరకు బలం పెరిగే ఛాన్స్ ఉంది. టిడిపితో పొత్తు ఉంటే జనసేన ఓట్లు యరపతినేనికి ప్లస్. మొత్తానికి ఈ సారి కాసుకు దెబ్బపడేలా ఉంది.