రాజకీయాల్లో గెలుపు అనేది శాశ్వతం కాదు..ఆ విషయం ప్రతి నాయకుడు గుర్తు పెట్టుకోవాలి. అలా కాకుండా గెలుపు శాశ్వతంగా దక్కుతుంది..ఇంకా తమకు తిరుగులేదు అనుకుంటే ఓటమి దిశగా వెళ్ళినట్లే. అదే సమయంలో మొదట గెలుపుకు సహకరించిన వారిని..గెలిచాక పక్కన పెడితే..తర్వాత వారే యాంటీ అవుతారు. దాని వల్ల రిస్క్ తప్పదు.
ఇప్పుడు మంత్రి విడదల రజిని పరిస్తితి అంతే..2019 ముందు వరకు రజిని అంటే ఎవరికి పెద్దగా తెలియదు. ఐటీ ఉద్యోగం వదులుకుని చంద్రబాబు ఆదర్శంతో టిడిపిలోకి వచ్చి..అప్పుడు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెనుక రాజకీయం నేర్చుకుని..2019 ఎన్నికల ముందు వైసీపీలోకి జంప్ కొట్టి..అప్పటికే చిలకలూరిపేటలో ఉన్న వైసీపీ సీనియర్ మర్రి రాజశేఖర్ని సైడ్ చేసి రజిని సీటు దక్కించుకుని ప్రత్తిపాటిని ఓడించి తొలి విజయం అందుకున్నారు. మొదట రజిని గెలుపుకు కారణం కమ్మ వర్గం..మర్రిది అదే వర్గం. అటు నరసారావుపేట వైసీపీ ఎంపీగా పోటీ చేసి గెలిచిన లావు శ్రీకృష్ణదేవరాయలుదే అదే వర్గం.
ఈ ఇద్దరి వల్ల పేటలో కమ్మ వర్గం ఓట్లు టిడిపి నుంచి నిలబడ్డ ప్రత్తిపాటికే పూర్తిగా పడకుండా..రజినికి పడ్డాయి. దీంతో ఆమె గెలిచారు. గెలిచాక ఆమె సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ స్టేట్ లో ఫేమస్ అయ్యారు. అలాగే మంత్రి అయ్యారు. ఇక తనకు తిరుగులేదని భావిస్తున్నారు. ఇటు మర్రి, లావులని సైడ్ చేశారు. వారి వర్గాలని పట్టించుకోవడం లేదు.
ఇప్పుడే అదే రజిని పెద్ద మైనస్. ఎలాగో బీసీల ఓట్లు రజినికి వన్సైడ్ గా పడవు. టిడిపి వైపు ఎక్కువ ఉంటారు. ఇటు జనసేన గాని టిడిపితో కలిస్తే కాపు ఓట్లు కలుస్తాయి. మర్రి, లావు రజినికి సహకరించరు. దీంతో కమ్మ వర్గం పూర్తిగా రజినికి యాంటీ అవుతుంది. దీంతో ఆమెకు ఈ సారి చెక్ పడటం ఖాయమని సర్వేలు చెబుతున్నాయి.