టిడిపి-జనసేన పొత్తు ప్రకటించిన తర్వాత ఏ స్థానాలు ఎవరికో, ఎక్కడ నుండి పోటీ చేస్తే, ఎవరు సపోర్ట్ తో గెలుస్తారు అని చర్చలు వినిపిస్తున్నాయి. జనసేన 45 స్థానాలు అడుగుతుంది అని రాజకీయ వర్గాల అంచనా. వాటిలో కొన్ని స్థానాలు టీడీపీ సపోర్ట్ తో మాత్రమే జనసేన గెలవగలదు.
ఆ స్థానాలు ఏంటంటే విశాఖ నార్త్ ఇక్కడ టిడిపి మద్దతుతో జనసేన కచ్చితంగా గెలిచి తీరుతుంది. యలమంచిలి ఇక్కడ ఎవరు పోటీ చేసినా సరే టిడిపి మద్దతుతో జనసేన సొంతం చేసుకుంటుంది. పిఠాపురం ఇక్కడ టీ టైం అధినేత ఉదయ్ శ్రీనివాస్ బరిలో ఉన్నారు, పిఠాపురం జనసేన లో ఉన్న సమస్యలను సమన్వయపరచడానికి ఉదయ శ్రీనివాస్ చాలా కష్టపడ్డారు. పిఠాపురం నుంచి ఉదయ శ్రీనివాస్ జనసేన అభ్యర్థిగా ఉన్నారు. టిడిపి మద్దతుతో కచ్చితంగా గెలుపొందే అవకాశాలే ఉన్నాయి. ఆఖరి క్షణంలో మారి పవన్ కళ్యాణ్ పోటీ చేసిన చేయవచ్చు.
కాకినాడ రూరల్ లో నానాజీ టిడిపి సపోర్ట్ తో గెలుపు సులువు అంటున్నారు. పెద్దాపురం నుండి జనసేన తరఫున తుమ్మల బాబు పోటీ చేస్తున్నారు. రాజానగరం బత్తుల ఈసారి జనసేన తరఫున టికెట్ ఆశిస్తున్నారు. ముమ్మిడివరం, రాజోలు, కొత్తపేట, నరసాపురం వీటిలో టిడిపి మద్దతుతో కచ్చితంగా గెలుపొందుతుంది.
భీమవరంలో ఇప్పటివరకు అభ్యర్థి పేరున ప్రకటించకపోయినా పవన్ ఇక్కడి నుంచి పోటీ చేసి ఈసారి కచ్చితంగా గెలిచి చూపిస్తారని రాజకీయ విశ్లేషకులు, జనసేన అభిమానులు అంటున్నారు. భీమవరం నుండి కూడా పవనే పోటీ చేస్తారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. తాడేపల్లిగూడెం నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ నియోజకవర్గంలో చురుకుగా ఉన్నారు. ఈసారి అతనే పోటీ చేసే అవకాశం ఉంది టిడిపి మద్దతు ఇస్తే ఖచ్చితంగా గెలుపు కూడా జనసేనదే .ఈ స్థానాలలో జనసేన కచ్చితంగా గెలవాలి అంటే టిడిపి మద్దతు తప్పనిసరి.