వైసీపీలో 40 మంది ఎమ్మెల్యేల పనితీరు మరీ దారుణంగా ఉంది..కొందరు పనితీరు యావరేజ్ గా ఉండగా..కొందరి పర్లేదు..అంటే బాగా బాగున్న వారి సంఖ్య 50 కూడా ఉండటం కష్టమే. సరే ఆ విషయం పక్కన పెడితే..ఇటీవల 18 మంది ఎమ్మెల్యే పనితీరు బాగోలేదని జగన్ ఓపెన్ గానే చెప్పారు. అలాగే పనితీరు బాగోని వారితో వ్యక్తిగతంగా మాట్లాడతానని అన్నారు. అయితే జగన్ పైకి చెప్పింది 18 మంది..కానీ దాదాపు 40 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని తెలిసింది.
వీరికి సీట్లు ఇచ్చే విషయంలో జగన్ ఆలోచన లో ఉన్నారని తెలిసింది. ఇదే క్రమంలో పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోశయ్య సీటుకు కూడా ఎసరు వచ్చేలా ఉంది. ఈయన సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు..అందుకే గత ఎన్నికల్లో సీటు దక్కింది. ఇంకా రోశయ్య అదృష్టం ఏంటంటే..టిడిపిలో బలమైన నేత ధూళిపాళ్ళ నరేంద్ర..పొన్నూరు నుంచి వరుసగా అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు…1994, 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో గెలిచి ఊపులో ఉన్నారు.
ఇక డబుల్ హ్యాట్రిక్ ఖాయమనుకునే సమయంలో వైసీపీ వేవ్ లో రోశయ్య అదృష్టం కొద్ది వెయ్యి ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇలా తొలిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ప్రజల్లో ఉంటూ పట్టు పెంచుకోవాలి. కానీ అదే చేయలేదు..పొన్నూరులో అక్రమాలు చేస్తున్నట్లు ఆరోపణలు..అటు ధూళిపాళ్ళని వైసీపీ ఎన్ని ఇబ్బందులు పెట్టిందో తెలిసిందే. అలా చేయడమే ఆయనకు ప్లస్.
తక్కువ కాలంలోనే పొన్నూరులో లీడ్ లోకి వచ్చేశారు నెక్స్ట్ ఎన్నికల్లో ఆరు నూరైన ధూళిపాళ్ళ గెలుపుని వైసీపీ ఆపలేదు. అయితే కాస్త పోటీ ఇవ్వడానికి ఎమ్మెల్యే రోశయ్యని పక్కన పెట్టి..బలమైన అభ్యర్ధిని పొన్నూరులో పెట్టే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. ఇటీవల జగన్..రోశయ్యతో వ్యక్తిగతంగా మాట్లాడి అదే తేల్చినట్లు సమాచారం. మొత్తానికి పొన్నూరులో ధూళిపాళ్ళకు ఈసారి బ్రేకులు లేవు.