తెలుగుదేశం పార్టీ బాగా బలంగా ఉన్న ప్రాంతాల్లో బాపట్ల పార్లమెంట్ కూడా ఒకటి. ఈ పరిధిలో టిడిపి చాలా స్ట్రాంగ్ గా ఉంది. గత ఎన్నికల్లో జగన్ వేవ్ లో కూడా ఇక్కడ లీడ్ టిడిపిదే అంటే పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ లీడ్ మరింత పెరిగింది. బాపట్ల పరిధిలో..అద్దంకి, చీరాల, పర్చూరు, రేపల్లె, వేమూరు, బాపట్ల, సంతనూతలపాడు నియోజకవర్గాలు ఉన్నాయి.
అందులో అద్దంకి, చీరాల, పర్చూరు, రేపల్లె నియోజకవర్గాల్లో టిడిపి గెలిచింది. మిగిలిన మూడో చోట్ల టిడిపి గెలిచింది. ఇప్పుడు సీన్ మారుతుంది. టిడిపి బలం పెరిగింది. పార్లమెంట్ అధ్యక్షుడుగా ఉన్న ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తన స్థానం పర్చూరుతో పాటు మిగిలిన స్థానాల్లో టిడిపి బలం పెరగడమే లక్ష్యంగా పనిచేశారు. ఇప్పుడు భవిష్యత్తుకు గ్యారెంటీ బస్సు యాత్రతో దూసుకెళుతున్నారు. ప్రజల మద్ధతు పెంచుకుంటున్నారు. అయితే ఇక్కడ టిడిపి గెలుపు గుర్రాలు దాదాపు ఫిక్స్ అయ్యారనే చెప్పాలి.
మళ్ళీ అద్దంకిలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పోటీ చేస్తారు..ఆయన గెలుపు కూడా సులువే. ఇటు పర్చూరులో ఏలూరి సాంబశివరావు, రేపల్లెలో అనగాని సత్యప్రసాద్ పోటీ చేయనున్నారు. వీరి గెలుపుకు ఢోకా లేదు. అటు సంతనూతలపాడులో బిఎన్ విజయ్ కుమార్, వేమూరులో నక్కా ఆనంద బాబు పోటీ చేస్తారు. ప్రస్తుతం వీరు ఆధిక్యంలో ఉన్నారు.
ఒక్క చీరాల క్లారిటీ లేదు. గత ఎన్నికల్లో ఇక్కడ టిడిపి నుంచి కరణం బలరామ్ గెలిచి వైసీపీలోకి వెళ్లారు. దీంతో టిడిపి ఇంచార్జ్ గా ఎంఎం కొండయ్య పనిచేస్తున్నారు. ఈయన సీటు ఆశిస్తున్నారు. కానీ పొత్తులో భాగంగా జనసేనకు ఈ సీటు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఈ సీటు ఎవరికి దక్కుతుందో..టిడిపి, జనసేన పొత్తు ఉంటే ఈ సీటు కూడా గెలుచుకోవడం ఈజీనే. మొత్తానికి బాపట్లలో స్వీప్ చేసేలా ఉన్నారు.