ఎన్నికల సీజన్ వచ్చేసింది..దీంతో సర్వే సంస్థల జోరు పెరిగిపోయింది. సర్వేలు చేస్తూ..ఏ పార్టీలు గెలుస్తాయో అంచనా వేసేస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో సర్వేల జోరు బాగా పెరిగింది. ఇక్కడ అనేక సంస్థలు సర్వేలు చేస్తున్నాయి. ఇక పార్టీలు తమ సొంత సర్వేలు కూడా చేస్తున్నాయి. అయితే ఒకప్పుడు సర్వేలకు ఒక నిబద్దత ఉండేది. ఇప్పుడు అవేం లేవు. దీంతో ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో ప్రజలకు అర్ధం కాకుండా ఉంది.
ఎవరికి వారు పార్టీలకు అనుకూలంగా సర్వేలు ఇస్తున్నారు. దీంతో ఆ సర్వేలు నమ్మడానికి లేకుండా పోయింది. జాతీయ సర్వేలు కూడా అలాగే ఉన్నాయి. ఇక జాతీయ స్థాయిలో పేరుగాంచిన టైమ్స్ నౌ సంస్థ కూడా కొన్ని రాజకీయ పార్టీలకు బాకా మీడియాగా మారిపోయింది.
దీంతో ఆ సంస్థ కూడా ప్రజల నమ్మకాన్ని కోల్పోయే పరిస్తితికి వచ్చింది. తాజాగా ఆ సంస్థ ఓ సర్వే విడుదల చేసింది. ఆ సర్వేలో జాతీయ స్థాయిలో బిజేపి జోరు ఉంటుందని చెప్పింది..ఇక ఏపీలో వైసీపీ హవా ఉంటుందని చెప్పుకొచ్చింది. అది కూడా 24-25 ఎంపీ సీట్లు గెలుచుకుంటుందని చెప్పింది. అసలు ఏపీలో ఉన్నదే 25 ఎంపీ సీట్లు అంటే…మొత్తం వైసీపీ స్వీప్ చేసిందని చెప్పింది.
మరి ఇది రియాలిటీగా ఉందా? అంటే ఎవరిని అడిగిన కాదు అంటారు..ఆఖరికి వైసీపీ వాళ్ళని అడిగిన అదే చెబుతారు..ఎందుకంటే గత ఎన్నికల్లో వైసీపీ గాలిలో కూడా 22 ఎంపీ సీట్లు గెలుచుకుంది..కానీ ఇప్పుడు గాలి లేదు..వ్యతిరేక గాలి ఉంది. ఇటు టిడిపి పుంజుకుంటుంది. ఇదే సమయంలో జనసేనతో పొత్తు ఉంటే..టిడిపి, జనసేనలకు మెజారిటీ ఎంపీ సీట్లు వస్తాయనే లెక్క వస్తుంది. అలాంటప్పుడు వైసీపీకి ఇన్ని సీట్లు అంటే..అది పెయిడ్ సర్వే అని అర్ధమవుతుంది. అయితే ఇలాగే వస్తే టిడిపికి మంచిది అని, వైసీపీ ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉండి దెబ్బతింటుందని అంటున్నారు.