రాజకీయాల్లో గెలుపు అనేది ప్రజల మద్ధతుతో దక్కించుకోవాలి..అప్పుడే అది నిజమైన విజయం అవుతుంది. అయితే గెలవడం కోసం ఎన్ని వ్యూహాలు అయినా వేయవచ్చు. ప్రత్యర్ధులని దెబ్బతీయవచ్చు. అయితే ఆ వ్యూహాలు నిజాయితీగా ఉండాలి..అడ్డగోలుగా ఉండకూడదు. అలా చేస్తే ప్రజలే బుద్ధి చెప్పే పరిస్తితి. అయితే ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ మళ్ళీ గెలవడం కోసం తీవ్రంగానే ప్రయత్నిస్తుంది.
ఇప్పటికే ప్రజా వ్యతిరేకతని అర్ధం చేసుకుని ఉన్న వైసీపీ..గెలుపు కోసం పలు అడ్డదారులు తొక్కుతుందని టిడిపి ఆరోపిస్తుంది. స్థానిక ఎన్నికల్లో ప్రత్యర్ధులని బెదిరించడం, నామినేషన్లు వేయనివ్వకుండా చేయడం, దొంగ ఓట్లు వేసుకోవడం చేసి గెలిచిందని, ఇప్పుడు అదే తరహాలో అసలైన ఎన్నికల్లో గెలవాలని చూస్తుందని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ దారుణమైన రాజకీయ క్రీడకు తెరతీసింది..ప్రతిపక్ష నేతలని బూతులు తిట్టడం, ఉన్నది లేనివి సృష్టించి రాజకీయం చేయడం చేస్తుంది.
ఇక అధికారాన్ని ఉపయోగించుకుని ఎన్ని అడ్డదారుల్లో వెళుతుందో లెక్క లేకుండా ఉందని అంటున్నారు. ఈ క్రమంలోనే ఓటర్ల లిస్టులో కూడా అక్రమాలకు తెరలేపుతున్నారు. ప్రతి నియోజకవర్గంలో దొంగ ఓట్లని నమోదు చేయడం..అలాగే టిడిపి, జనసేన సానుభూతి పరుల ఓట్లు తొలగించడం..ఇదే ఇప్పుడు వైసీపీ చేసే పని. వేల కొద్ది దొంగ ఓట్లు నమోదు చేయిస్తున్నారని పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి.
అసలు మరీ ఘోరమైన విషయం ఏంటంటే…15-18 ఏళ్ల లోపు పిల్లలని కూడా ఓటర్లుగా నమోదు చేయిస్తున్నారట. ఈ తతంగం…చిత్తూరు జిల్లాలోని పీలేరులో నడుస్తుందట. వైసీపీ నేతలు, వాలంటీర్లతో కలిసి ఈ వ్యవహారం నడిపిస్తున్నట్లు తెలిసింది. ఇక వీటిపై ఎన్నికల అధికారుల చర్యలు కూడా తక్కువగానే ఉన్నాయని, ఫిర్యాదులు చేసిన లాభం ఉండటం లేదని టిడిపి నేతలు అంటున్నారు. మరి ఈ దొంగ ఓట్లు వైసీపీని గెలిపిస్తాయో లేదో..చూడాలి.