యువగళం పాదయాత్రతో లోకేష్ దూసుకెళుతున్న విషయం తెలిసిందే. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ…వారికి అండగా ఉంటామని హామీ ఇస్తూ ముందుకెళుతున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రజల మద్ధతు ఇంకా పెంచుకుంటున్నారు. టిడిపి బలం కూడా పెరుగుతుంది. ప్రస్తుతానికి ఆయన పాదయాత్ర నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అక్కడ ప్రజల మద్ధతు భారీగా వస్తుంది.
తాజాగా నెల్లూరు రూరల్ లో లోకేష్ పాదయాత్ర ఎంటర్ అయింది. అక్కడ వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి..ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డి లోకేష్కు భారీ స్వాగతం పలికారు. ఇక ఆయన పాదయాత్రకు జనం భారీగా వచ్చారు. అయితే కోటంరెడ్డి టిడిపిలోకి ఎంట్రీ, లోకేష్ పాదయాత్ర…వైసీపీపై వ్యతిరేకత ఈ అంశాలు నెల్లూరు రూరల్ లో టిడిపికి మొదట విజయాన్ని అందించేలా ఉన్నాయి. 2008 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నెల్లూరు రూరల్ ఏర్పడింది.
ఇక 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఆనం వివేకానందరెడ్డి గెలిచారు. అప్పుడు ప్రజారాజ్యం సెకండ్ ప్లేస్ లో ఉండగా, టిడిపి పొత్తులో పోటీ చేసిన సిపిఐ మూడో స్థానానికి పరిమితమైంది. ఆ తర్వాత 2014లో వైసీపీ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోటీ చేసి గెలిచారు. అప్పుడు టిడిపితో పొత్తులో బిజేపి పోటీ చేసి ఓడిపోయింది. అలా వేరే పార్టీలకు సీటు ఇవ్వడం టిడిపికి మైనస్ అయింది.
2019లో టిడిపి డైరక్ట్ గా బరిలో దిగింది..కానీ వైసీపీ వేవ్ లో ఓడిపోయింది. వైసీపీ నుంచి కోటంరెడ్డి గెలిచారు. ఇప్పుడు ఆయన టిడిపిలోకి వచ్చారు. అయితే కోటంరెడ్డి ఇమేజ్..ప్లస్ టిడిపి బలంతో ఈ సారి నెల్లూరు రూరల్ సీటుని గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.