ఏ ప్రభుత్వమైన ఆదాయం సృష్టించి..సంక్షేమ పథకాలు అమలు చేస్తే ఆర్ధిక పరంగా ఆ ప్రభుత్వాలు బలంగా ఉంటాయి. అలాగే ప్రజలపై ఆర్ధిక భారం పడదు. కానీ ఏపీలో వైసీపీ ప్రభుత్వం మాత్రం..అప్పులు చేసి సంక్షేమ పథకాలు ఇవ్వడం, అభివృద్ధి చేయకపోవడం, ఆదాయం సృష్టించడం లేదు..మళ్ళీ పథకాల రూపంలో డబ్బులు పంచి…పన్నుల రూపంలో వెనక్కి లాగుతున్నారు. ఏపీలో ప్రతి వస్తువు ధర పెరిగింది. నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్, ఇసుక, మద్యం, సిమెంట్…అబ్బో ఇలా ఒకటి ఏంటి ప్రతిదీ రేటు పెరిగిపోయింది.
దీని వల్ల ప్రజలపై ఆర్ధిక భారం పడుతుంది. అయితే దీన్ని కవర్ చేసుకోవడానికి వైసీపీ నేతలు..అన్నీ రాష్ట్రాల్లో రేట్లు పెరగలేదా? అని అంటున్నారు. అలాంటప్పుడు పక్కన ఉన్న తమిళనాడు, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు ఎందుకు తక్కువగా ఉన్నాయి..ఏపీలో ఎందుకు ఎక్కువగా ఉన్నాయనే అంశంపై మాట్లాడారు. అయితే ఇవన్నీ ప్రజలకు అర్ధమవుతున్నాయి. ఇటు ఈ అంశాలపై ప్రతిపక్ష టిడిపి సైతం పోరాటాలు చేస్తుంది. ఈ క్రమంలోనే వైసీపీ వచ్చాక భారీగా ఇసుక ధరలు పెరగడమే కాదు..దోపిడి పెరిగింది.
దీనిపై ఇప్పుడు టిడిపి పోరాటం చేస్తూనే ఉంది..ఇప్పుడు మళ్ళీ కొత్త పంథాలో వైసీపీ నేతల దోపిడిపై గళం విప్పుతున్నారు. గత టిడిపి ప్రభుత్వంలో ఇసుక ఉచితంగా ఇచ్చేవారు. ఇప్పుడు వైసీపీ భారీ రేట్లకు అమ్ముకుంటుంది. దీని వల్ల దోపిడి పెరిగింది..అటు నిర్మాణ రంగంలో వ్యయం పెరిగింది. పేద, మధ్యతరగతి ప్రజలు ఇల్లు కట్టుకోవాలంటే కష్టమైపోయింది.
ఒక ఉదాహరణగా గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఓ మధ్య తరగతి కుటుంబం డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టుకోవాలంటే 7-8 లక్షలు సరిపోయేవి..ఇప్పుడు జగన్ హయాంలో 15 లక్షలు కూడా చాలడం లేదు. అంటే ఎంత భారం పడుతుందో అర్ధం చేసుకోవచ్చు. ఈ అంశాలు ప్రజలకు తెలుస్తుంది. ఇటు టిడిపి పోరాటం చేస్తుంది..రానున్న ఎన్నికల్లో ఇసుక అంశం కూడా ప్రభావం చూపనుంది.