గత కొన్ని రోజుల నుండి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ప్రజలందరినీ భయాందోళనలకు గురి చేస్తున్నాయి. సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రిని ఇంతలా వేధిస్తున్న ఈ ప్రభుత్వం లో సామాన్యుని పరిస్థితి ఏమిటి అని ప్రతి ఒక్కరూ ఆలోచనలో పడ్డారు.
వాస్తవాలు ప్రజలకు తెలియకుండా వైసిపి మీడియాను తన గుప్పెట్లో ఉంచుకొని టిడిపి పై కుట్రలు చేస్తోంది. ప్రింట్ మీడియా, న్యూస్ ఛానల్స్ వీటిలో చంద్రబాబుని దోషి అని నిరూపించడానికి తన వంతు ప్రయత్నం చేస్తోంది. ఇవి చాలక సోషల్ మీడియా అయిన వాట్సాప్, యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ ఇలా ప్రతి చోటా తన అనుకూల వర్గంతో చంద్ర బాబు నాయుడు పై వ్యతిరేకతను ప్రచారం చేస్తోంది.
వైసిపి అధికార బలానికి భయపడ్డారో లేదా బెదిరింపు చర్యలకు లొంగిపోయారో తెలియదు గాని పత్రికలు, న్యూస్ చానల్స్ అన్నీ వైసీపీకి కొమ్ము కాసే విధంగా తన కథనాలను వినిపిస్తున్నాయి. వైసీపి అనుకూల మీడియా చంద్రబాబు అరెస్ట్ ఆ మాట తప్ప ఆ కేసులో చంద్రబాబు నాయుడు పాత్ర ఏమిటి అన్నది కూడా ఆలోచించకుండా చంద్రబాబు నాయుడు ఏ 1 అంటూ ప్రజలందరికీ ప్రచారం చేస్తున్నారు. కోర్టులో జరిగిన వాదనలను కూడా వక్రీకరించి తమకు అనుకూలంగా ప్రజలలోనికి తీసుకువెళ్లారు. పెట్టిన కేసు చెల్లదని సామాన్యులు సైతం చెబుతుంటే వైసీపీ మాత్రం తన కుట్రలతో చంద్రబాబు నాయుడుని జైలు పాలు చేయాలని చూస్తోంది.
వైసిపి పెయిడ్ ఆర్టిస్ట్ లతో చంద్రబాబు నాయుడు దోషి అని ప్రతి నిమిషం డిబేట్ లు పెట్టి అవే నిజమని ప్రజల పైన రుద్దుతున్నారు. పెయిడ్ ఆర్టికల్స్ తో ఒక్కొక్కసారి చంద్రబాబు దోషి అని వీళ్ళు చెప్పిందే నిజమా అని నమ్మేలా ప్రజలలోకి తీసుకుని వెళ్లారు. వైసిపి తన కుట్రలతో చంద్రబాబు నాయుడు ను జైలు పాలు చేయగలిగినా ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని, చంద్ర బాబు నాయుడు కడిగిన ముత్యంలా బయటకి వస్తారని టిడిపి నేతలు ధైర్యంతో ఉన్నారు. అదే సమయంలో వైసీపీ మీడియాలో అసత్య కథనాలకు టిడిపి అదే స్థాయిలో కౌంటర్లు ఇవ్వాల్సి ఉంది. అప్పుడే ప్రజలకు నిజనిజాలు అర్ధమవుతాయి.