ఎన్నికలకు ఆరు మాసాల ముందే.. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీకి ఎదురుగాలి వీస్తున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. ప్రభుత్వ ఉదాసీన వైఖరికితోడు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు అనుసరిస్తున్న వైఖరితో ప్రజలు విసిగిపోతున్నారు. ఈ క్రమంలో ఎన్నికల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి వాటిలో గుంటూరు జిల్లాలోని పెదకూరపాడు జనరల్ స్థానం ముందంజలో ఉంది.
ఇక్కడ ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా? అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. తమ కోసం త్యాగాలు చేస్తు న్న నాయకుడు, తమ కోసం కేసులకు కూడా వెరవకుండా.. పోరాటం చేస్తున్న నాయకుడు టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ను గెలిపించుకునేందుకు ప్రజలు మానసికంగా సిద్ధమైపోయా రు. ఇటీవల వైసీపీ చేయించిన అంతర్గత సర్వేలో ప్రస్తుత ఎమ్మెల్యే నంబూరి శంకర్రావుకు తీవ్ర వ్యతిరేకత వచ్చినట్టు తెలిసింది. మెజారిటీ ప్రజల నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్రావుకు సపోర్ట్ లేదన్న వాతావరణం అప్పుడే స్పష్టంగా కనిపిస్తోంది.
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గత రెండున్నర సంవత్సరాల నుంచే కొమ్మాలపాటి నియోజకవర్గంలో యాత్రలకు శ్రీకారం చుట్టడంతో పాటు ప్రతి రోజూ ప్రజల్లోనే ఉన్నారు. అసలు నియోజకవర్గానికి సిట్టింగ్ ఎమ్మెల్యే కొమ్మాలపాటే అన్నంతగా ఆయన ప్రజల్లోనే ఉన్నారంటూ అతిశయోక్తి కాదు. ఇటు ప్రజలకే కాకుండా.. అటు పార్టీ పరంగా కూడా కొమ్మాలపాటి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ.. ఇక్కడ ఆయన అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రిలేదీక్షలు.. నిరసనలతో హోరెత్తించారు. ఈ పరిణామం టీడీపీలో జోష్ పెంచింది.
గత మూడేళ్లుగా కొమ్మాలపాటి సమస్య ఎక్కడుంటే.. అక్కడ తాను ప్రత్యక్షమవుతున్నారు. పార్టీ పరంగా కార్యకర్తలను కలుపుకొని వెళ్లడం.. వారి సమస్యలను కూడా పరిష్కరించే ప్రయత్నం చేయడంతో పార్టీలోనూ కొమ్మాల పాటి గ్రాఫ్ మరింత పుంజుకుంది. పెదకూరపాడులో చేస్తోన్న సర్వేలన్నీ కొమ్మాలపాటికి వన్సైడ్ విక్టరీ అంటున్నాయి. ఏదేమైనా ఎన్నికలకు ఐదు నెలల ముందే కొమ్మాలపాటికి పూర్తి సానుకూల వాతావరణం కూరపాడులో కనిపిస్తోంది. ఇదే గ్రాఫ్ ఎన్నికల వరకు కంటిన్యూ అయితే ఈ సారి రికార్డు మెజార్టీతో ఆయన గెలుపు పక్కా..!