ప్రశాంత్ కిషోర్ ఈ పేరు అందరికీ తెలిసిన పేరు.ఇతనేమి రాజకీయ నాయకుడు కాదు.కానీ రాజకీయాలను శాసించగల వ్యక్తి.2019లో ఇతని వ్యూహాలతో వైసిపిని అధికారంలోకి వచ్చిందన్నది జగమెరిగిన సత్యం.అటువంటి ప్రశాంత్ కిషోర్ ఈసారి వైసీపీ అధికారంలోకి రావడం కష్టమే అంటూ వైసీపీ నేతలతో చెప్పడమే కాదు, బహిరంగంగానే చెబుతున్నారు.అలా చెబుతున్నప్పుడు వైసిపి వారు ప్రశాంత్ కిషోర్ మాటలను ఎలా తీసుకుంటారా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఎవరైనా వైసిపికి వ్యతిరేకంగా మాట్లాడితే వారికి కులాన్ని లేదా ఎల్లో మీడియా అంటూ విమర్శించటం వైసిపి నాయకులకు అలవాటే.మరి వై సీ పీ వారే రాష్ట్రానికి పరిచయం చేసిన ప్రశాంత్ కిషోర్ ఇలా మాట్లాడుతుంటే అతనికి కులం ఆపాదిస్తారా లేక మౌనమే సమాధానం అంటారా వేచి చూడాల్సిందే.
అసలు ప్రశాంత్ కిషోర్ వ్యూహాలలో భాగంగానే ఈ కుల రాజకీయాలు,మీడియాలో వర్గాలు వచ్చాయని రాజకీయ ప్రముఖులు అంటున్నారు.సంపద సృష్టి లేకుండా అప్పులు చేస్తూ పోతే రాష్ట్ర అభివృద్ధి అధోగతి పాలవుతుందంటూ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ వారు ఏమని సమాధానం చెబుతారో.ప్రశాంత్ కిషోర్ కు ఆంధ్ర ప్రదేశ్ పై మంచి పట్టు ఉంది.టిడిపి పైన,వైసిపి పైన అవగాహన ఉంది.రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులు ప్రశాంత్ కిషోర్ కు తెలుసు. ఇంత అవగాహన ఉన్న ఒక వ్యక్తి బహిరంగంగానే ఒక పార్టీ గురించి ఒక రాష్ట్రం గురించి విమర్శలు చేయడం అంటే సాధారణ విషయం కాదు.
మరి ఈ విమర్శలను వైసిపి వారు ఎలా తీసుకుంటారో???