అధికారంలో ఉన్నవారు ఏమి చేసినా అడ్డు చెప్పేవారు ఉండరు అని అందరికీ తెలిసిన విషయమే.అది ఏ రాష్ట్రంలో అయినా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తూనే ఉంటుంది.కానీ ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీని నామరూపాలు లేకుండా చేయాలని ఆలోచనతో వైసిపి రాక్షసానందం పొందడానికి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నే వేధిస్తోందంటే,గ్రామస్థాయిలో ఉన్న టిడిపి నాయకులు,నేతలు,కార్యకర్తల పరిస్థితి ఏమిటో అని ఒకసారి ఆలోచించాల్సిందే.
చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపించారు. అన్నిరకాలుగా టీడీపీని, బాబు ఫ్యామిలీని ఇబ్బందులు పెట్టారు. కానీ ఎక్కడ వాళ్ళు ధైర్యం కోల్పోలేదు. ఇలాంటి తరుణంలో బాబుకు మధ్యంతర బెయిల్ వచ్చింది. టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. కానీ బాబుని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నా వైసీపీ ఇంకో కేసు పెట్టింది. ఇప్పుడు సిఐడి అక్రమ మద్యం కేసులో ఏ 3 గా చంద్రబాబు నాయుడు పేరును చేర్చిఇంకొక కేసును కోర్టులో వేశారు.దానిలో విచారణకి కూడా కోర్టు అంగీకరించింది. మళ్ళీ వాయిదా పడింది. ఇప్పుడు టిడిపి నాయకులకే కాదు సామాన్య ప్రజలకు సైతం వైసీపీ చంద్రబాబు నాయుడును కక్ష సాధిస్తుందని అర్థమవుతుంది.
చంద్రబాబు హయాంలో మద్యం కంపెనీలను అక్రమంగా ప్రవేశపెట్టారని,వారికి అనుమతులు ఇచ్చారని ఈ కేసులో సారాంశం.చంద్రబాబు నాయుడు అనుమతులు ఇచ్చినది 2019కి ముందు 2019 తర్వాత ఉన్నది వైసీపీ ప్రభుత్వమే కదా అలాంటప్పుడు నాలుగేళ్ల నుంచి ఆ కంపెనీలను గుర్తించలేకపోయారా లేక ఇప్పుడు అవసరం వచ్చిందని పట్టించుకున్నారా అని ప్రశ్నలు సామాన్యులకు సైతం అనుమానాలు వస్తున్నాయి.మూడు రాజధానులు అంటూ అమరావతి రద్దు చేసిన వైసిపి,ఇసుక రివర్స్ టెండర్ లంటూ ఇసుక రీచ్ లను ఆపి భవన నిర్మాణం ని కోలుకొని దెబ్బతీసిన వైసిపి మద్యం బ్రాండ్లను గుర్తించటానికి నాలుగేళ్ల సమయం తీసుకుందా అని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
కల్తీ మద్యంతో ప్రజల జీవితాలతో ఆటలాడుతున్న వైసిపి ఇప్పుడు అదే మధ్యాన్ని సాకుగా చూపి ప్రతిపక్ష నాయకుడిని ఇబ్బందులకు గురిచేయాలని చూస్తోంది.ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది అది కొంచెం ఆలస్యం అవ్వచ్చు అని టిడిపి నేతలు అంతా సమన్వయం పాటిస్తూ తమ నాయకుడు నిర్దోషిగా బయటకు రావాలని కోరుకుంటున్నారు.ఇప్పటికైనా వైసీపీ తన అరాచకాలను ఆపకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని హెచ్చరిస్తున్నారు……