రాష్ట్రంలో వైసీపీ అరాచకాలకు అంతులేకుండా పోతుంది.వైసీపీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారిపై తప్పుడు కేసులు పెడుతూ వేధించటం,తమ పార్టీ నాయకుల ముసుగులో ఉన్న గుండాలతో దాడులు చేయించటం ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు సర్వసాధారణమైపోయాయి.
కావలి ఆర్టీసీ డ్రైవర్ పై జరిగిన దాడి వెనుక ఎవరు ఉన్నారో అందరికీ తెలుసు,కానీ తమ వారు కాదంటూ టిడిపి నేతలపై కేసులు పెట్టారు.టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగించమంటూ ఒక అధికారిపై వైసీపీ నేతలు ఒత్తిడి తెస్తే తన వల్ల కాదంటూ అలా చేయలేను అన్నందుకు అధికారిపై కమ్మ సామాజిక వర్గం ముద్ర వేసి గొడవకు దిగారు. టిడిపి గెలవాలంటూ సైకిల్ యాత్ర చేస్తున్న టిడిపి కార్యకర్త సైకిల్ కి ఉన్న జెండాలు పీకి,చొక్కా విప్పి నడిరోడ్డుపై నిలబెట్టి గొడవ చేశారు.
ఇంత జరుగుతున్నా ప్రశ్నించడానికి ఒక్కరు కూడా లేకుండా పోయారని సామాన్య ప్రజలు వాపోతున్నారు.ఎమ్మెల్సీ ఇంట్లోనే డ్రైవర్ హత్య జరిగితే అరెస్ట్ అంటూ,పార్టీ నుంచి సస్పెన్షన్ అంటూ వైసీపీ నేతలు హడావిడి చేశారు.కానీ అదే ఎమ్మెల్సీ ని బెయిల్ పై బయటకు తీసుకువచ్చి అధికారికంగా తమ పార్టీలోనే తిప్పుకుంటున్నారు.
సామాజిక సాధికారత,బడుగు బలహీన వర్గాల సంక్షేమం అంటూ వేదికలపై మైకుల ముందు స్పీచ్ ఇవ్వడం కాదు.తప్పు చేసింది తమవారని ఒకసారి కాకపోతే ఒకసారి అయినా ప్రజలు ముందు ఒప్పుకొని పొరపాటు మళ్ళీ జరగకుండా ఉండేలా చూసుకుంటామని అధికార పార్టీకి చెప్పే ధైర్యం ఉండాలి అని ప్రతిపక్ష పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.
మరి ఇప్పటికైనా వైసీపీ నేతలు తమ తీరు మార్చుకుంటారా లేక సొంత కార్యకర్తలు,వైసీపీ అభిమానుల నుంచే వ్యతిరేకత మూట కట్టుకుంటారా????