అంబటి రాంబాబు ఎమ్మెల్యేగా,మంత్రిగా మంచి మాటకారిగా వైసిపికి కీలక నేతలలో ఒకరిగా చెప్పవచ్చు.ప్రతిపక్ష నేతలను నోరెత్తకుండా చేయగల సమర్థుడు అంబటి రాంబాబు.అలాంటి రాంబాబు పై తెలంగాణ రాష్ట్రంలో దాడి జరిగింది. దాడి ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అని నిజానిజాలు తెలియకుండానే అంబటి రాంబాబు ఆ దాడికి కులమే కారణమంటూ ట్వీట్ చేశారు.అది వైసిపి పై కోపంతో టిడిపి వారు చేశారన్న ప్రజలు అంగీకరించే వారేమో కానీ,తనపై కుల ద్వేషంతో కమ్మ సామాజిక వర్గం వారు దాడి చేశారు అనేలా అంబటి మాట్లాడడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.అసలే గొడవలలో ఉన్న రాష్ట్రంలో కుల రాజకీయాలు అవసరమా అంబటి రాంబాబు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నీకులమేమిటి నీ కులం వారు నీతో వస్తారా అని కూడా విమర్శిస్తున్నారు.ఇప్పటికే సొంత పార్టీలో వ్యతిరేకత, సొంత నియోజకవర్గంలో వ్యతిరేకత మూట కట్టుకున్న అంబటి ఎలాగైనా గెలిచి తీరాలనే ఆలోచనతో విచక్షణ కోల్పోయి ఏమి చేస్తున్నారో కూడా తెలియడం లేదని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు.
నియోజవర్గానికి చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో ఓట్ల అడిగితే బాగుంటుంది కానీ,కులాల కుంపట్లతో ఓట్లు పొందాలంటే ఈ కాలంలో అది అసాధ్యం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అంబటి రాంబాబు ఇప్పటికైనా కుల ప్రస్తావన లేకుండా ప్రజల ముందుకు వెళితే మంచిదని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అంబటి తీరు మారుతుందా లేక వైసీపీ అధిష్టానం అంబటినే మారుస్తుందా????? వేచి చూడాల్సిందే…..