ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ హవా పెరిగిన విషయం తెలిసిందే. పార్టీకి అనూహ్యంగా బలం పెరిగింది. వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత, వైసీపీ నుంచి టిడిపిలోకి ముగ్గురు ఎమ్మెల్యేలు రావడం,. లోకేష్ పాదయాత్ర..ఈ అంశాలు టిడిపికి పెద్ద ప్లస్ అయ్యాయి.అలాగే నెల్లూరు లో దాదాపు టిడిపి సీట్లు ఫిక్స్ అయిపోతున్నాయి. అదే సమయంలో వైసీపీ నుంచి టిడిపిలోకి వచ్చిన వారికి దాదాపు సెట్ అయినట్లే.
ఆనం రామనారాయణ రెడ్డి..ఆత్మకూరు సీటులో, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి..నెల్లూరు రూరల్ సీటులో పోటీ చేయడం ఖాయం. కాకపోతే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి విషయమే కాస్త కన్ఫ్యూజన్..ఈయన వైసీపీ వదిలి టిడిపి వైపుకు వచ్చారు.కానీ ఈయన ప్రాతినిధ్యం వహించే ఉదయగిరిలో టిడిపి నేత బొల్లినేని వెంకట రామారావు ఉన్నారు..2014లో ఈయన టిడిపి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు..2019లో ఓడిపోయారు. అయితే ఇప్పుడు మేకపాటి టిడిపి వైపుకు రావడంతో ఉదయగిరి సీటుపై కన్ఫ్యూజన్ ఉంది.
ఇదే సమయంలో ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్ సైతం ఉదయగిరి సీటు ఆశిస్తున్నారు. దీంతో చంద్రబాబు..ఉదయగిరి సీటు ఎవరికి ఇస్తారనే కన్ఫ్యూజన్ ఉంది. ఇదిలా ఉంటే ఉదయగిరి వైసీపీ సీటు కోసం కూడా చాలామంది పోటీపడ్డారు. కానీ చివరికి మేకపాటి రాజమోహన్ రెడ్డి మరో సోదరుడు రాజగోపాల్ రెడ్డికి కేటాయించారు. ఇక చంద్రశేఖర్ రెడ్డి కూడా మేకపాటి సోదరుడు అనే సంగతి తెలిసిందే.
ఇలా వైసీపీ అభ్యర్ధి ఫిక్స్ కావడంతో టిడిపి అభ్యర్ధి ఎవరనేది చర్చగా మారింది. టిడిపి నేతలని కాదని మేకపాటికి బాబు సీటు ఇచ్చే అవకాశాలు తక్కువే. మేకపాటికి ఏమైనా పదవి ఇచ్చి…ఉదయగిరి సీటు బొల్లినేనికే దక్కే ఛాన్స్ ఉంది. చూడాలి మరి చివరికి ఉదయగిరి అభ్యర్ధిగా ఎవరు ఫిక్స్ అవుతారో.